Webdunia - Bharat's app for daily news and videos

Install App

పది నగరాల్లో పరుగులు తీయనున్న బుల్లెట్ రైళ్లు..

Webdunia
శనివారం, 23 ఫిబ్రవరి 2019 (18:48 IST)
చెన్నై-బెంగళూరు, ముంబై-ఢిల్లీ వంటి పది పట్టణాలకు కొత్త మార్గాల ద్వారా బుల్లెట్ రైళ్లను నడపనున్నట్లు రైల్వే శాఖ నిర్ణయించింది. చైనా, జపాన్ దేశాల్లో బుల్లెట్ రైళ్లు నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇదే తరహాలో భారత్‌లో కూడా బుల్లెట్ రైళ్లు నడపాలని కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. ఇందుకోసం రైల్వే శాఖ తగిన చర్యలు తీసుకుంటోంది. 
 
ఢిల్లీ నుంచి ముంబై, కొల్‌కతా, వారణాసి, భోపాల్, అమృతసర్, అహ్మదాబాద్ వంటి ఆరు మార్గాల ద్వారా బుల్లెట్ రైళ్లను నడపాలని రైల్వే మంత్రిత్వ శాఖ సన్నాహాలు చేస్తోంది. ఇదేవిధంగా నాగ్‌పూర్-ముంబై, పాట్నా-కోల్‌కతా మార్గాల ద్వారా బుల్లెట్ రైళ్లను నడపాలని నిర్ణయించడం జరిగింది. ఇప్పటికే మైసూర్-బెంగళూరు-చెన్నైల మధ్య బుల్లెట్ రైళ్లను కూడా నడిపేందుకు రంగం సిద్ధమైంది.
 
మొత్తం మీద దేశ వ్యాప్తంగా 10 మార్గాల్లో బుల్లెట్ల రైళ్ల కోసం రైల్వే శాఖ పథకం వేసినట్లు తెలుస్తోంది. ఇందుకోసం రూ.10 లక్షల కోట్లు కేటాయించాలని రైల్వేశాఖ వెల్లడించింది. ఇందుకు సంబంధించిన పత్రాలపై కేంద్ర కేబినెట్ ఆమోదం వేయాల్సి వుంది. 2025 లేదా 2026లో ఈ బుల్లెట్ రైళ్లు పూర్తి స్థాయిలో నడపనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా మనసుకు చేరువైన పాత్ర ఏదీ లేదు : పవన్ కళ్యాణ్

హీరో విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేసు

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments