PM Modi Nomination: మోడీ ఈసారి గెలిస్తే భవిష్యత్తులో ఎన్నికలు వుండవంటున్న ఖర్గే

ఐవీఆర్
మంగళవారం, 14 మే 2024 (11:33 IST)
నరేంద్ర మోడీ ఈసారి ఎన్నికల్లో విజయం సాధిస్తే భవిష్యత్తులో దేశంలో ఎన్నికలనేవి జరగకుండా చేస్తారనని ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సంచలన వ్యాఖ్యలు చేసారు. మోడీది నియంతృత్వ పోకడ అనీ, అలాంటివారికి తప్పకుండా బుద్ధి చెప్పి గద్దె నుంచి దించేయాలని పిలుపునిచ్చారు.
 
మోడీకి దమ్ముంటే పారిశ్రామికవేత్తలైన అదానీ, అంబానీలు అరెస్టు చేయాలని సవాల్ విసిరారు. ఝార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈమేరకు ఆయన వ్యాఖ్యలు చేసారు. ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి సోరెన్ ను అరెస్టు చేసినట్లుగా అంబానీ, అదానీలను అరెస్ట్ చేసే సత్తా వారికి వుందా అని ప్రశ్నించారు.
 
ఇండియా కూటమి అధికారంలోకి రాగానే అరెస్టయిన నాయకులందరినీ బయటకు తీసుకుని వస్తామని అన్నారు. నరేంద్ర మోడీని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో గెలవకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై వున్నదంటూ పిలుపునిచ్చారు. కాగా ప్రధాని నరేంద్ర మోడీ ఈరోజు వారణాసి లోక్ సభ స్థానానికి నామినేషన్ వేస్తున్నారు. ఈ కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ హాజరవుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Down down CM: డౌన్ డౌన్ సి.ఎం. అంటూ రేవంత్ రెడ్డి సమావేశం వద్ద నిరసన సెగ

Revanth Reddy: కర్ణుడులా మిత్ర ధర్మాన్ని పాటిస్తా, సినీ కార్మికుల వెల్ఫేర్ కోసం పది కోట్లు ఇస్తా : రేవంత్ రెడ్డి

నేను కంటి నిండా నిద్రపోయి చాలా నెలలైంది.. మీరు అలాచేయకండి.. రష్మిక

ఇన్వెస్టిగేటివ్ మిస్టరీ థ్రిల్లర్ గా కర్మణ్యే వాధికారస్తే చిత్రం

Rajinikanth: రజనీకాంత్ కు అదే ఆఖరి సినిమానా, రిటైర్ మెంట్ కారణమా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments