71 యేళ్ల వయసులో తొలిసారి ఓటు వేయనున్న వృద్ధుడు.. ఎక్కడ?

ఠాగూర్
ఆదివారం, 7 ఏప్రియల్ 2024 (11:12 IST)
జార్ఖండ్ రాష్ట్రంలో అన్సారీ అనే వృద్ధుడు 71 యేళ్ల వయసులో తన ఓటు హక్కును తొలిసారి వినియోగించుకోనున్నాడు. రాష్ట్రంలోని సాహిబ్‌గంజ్ జిల్లాలో ఈ ఘటన వెలుగు చూసింది. 1953లో జన్మించినప్పటికీ ఇప్పటివరకూ ఆయన ఒక్కసారి కూడా ఓటు హక్కును వినియోగించుకోలేదు. దీనికి కారణం ఆయన పేరు ఒక్కసారిగా కూడా ఓటర్ల జాబితాలో చేర్చలేదు. సాహిబ్‌గంజ్ జిల్లా బాడ్ఖోరీ గ్రామానికి చెందిన ఖలీల్ అన్సారీ 1953 జనవరి ఒకటో తేదీన అంటే భారత తొలి లోక్‌‍సభ ఎన్నికలు జరిగిన యేడాది తర్వాత జన్మించారు. కంటి చూపునకు నోచుకోని అన్సారీ ఇప్పటివరకూ ఒక్కసారిగా కూడా ఓటు హక్కును వినియోగించుకోలేదు. 
 
ప్రభుత్వ ఎన్నికల ఏర్పాట్లలో భాగంగా, జార్ఖండ్ ప్రధాని ఎన్నికల అధికారి కె.రవికుమార్ ఇటీవల అన్సారీ ఉంటున్న గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వృద్ధుడి విషయం ఆయన దృష్టికి వచ్చింది. తనిఖీల సందర్భంగా అన్సారీ పేరు ఎక్కడా ఓటర్ల లిస్టులో కనపడలేదని కుమార్ తెలిపారు. దీనర్థం.. అన్సారీ ఇప్పటివరకు ఒక్కసారిగా కూడా ఓటు హక్కును వినియోగించుకోలేదని ఆయన అన్నారు. మరోవైపు, తొలిసారిగా ఓటు వేసే అవకాశం దక్కినందుకు అన్సారీ ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. కాగా, ప్రస్తుతం దేశంలో జరుగనున్న సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా, జూన్ 1వ తేదీన జరిగే పోలింగ్‌లో ఆయన రాజ్‌మహాల్ లోక్‌సభ స్థానం పరిధిలో తన ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గుజరాత్ బ్రాండ్ కాన్‌ప్లెక్స్ సినిమాస్ ప్రారంభించిన స్పీకర్, సిద్దు జొన్నలగడ్డ

Pawan: డల్లాస్ లో ఓజీ 25 అడుగుల కటౌట్ - నైజాంలో పుష్ప 2: ది రూల్ ను క్రాస్ చేస్తుందా....

హారర్ కాన్సెప్ట్‌లో ప్రేమ కథ గా ఓ.. చెలియా టీజర్ ను ఆవిష్కరించిన శ్రీకాంత్

Chakri: సింగర్ జుబీన్ గార్గ్‌కు హీరోయిన్ భైరవి అర్ద్య డేకా ఘన నివాళి

Anil Ravipudi: ఐదుగురు కుర్రాళ్లు భూతానికి, ప్రేతానికి చిక్కితే ఏమయింది...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కిడ్నీలను పాడు చేసే పదార్థాలు

అల్లం టీ తాగితే ఏంటి ప్రయోజనాలు?

భారతీయ రోగులలో ఒక కీలక సమస్యగా రెసిస్టంట్ హైపర్‌టెన్షన్: హైదరాబాద్‌ వైద్య నిపుణులు

శనగలు తింటే శరీరానికి అందే పోషకాలు ఏమిటి?

Navratri Snacks: నవరాత్రి స్నాక్స్.. సగ్గుబియ్యం టిక్కా.. అరటి పండ్ల చిప్స్ సింపుల్‌గా..

తర్వాతి కథనం
Show comments