Webdunia - Bharat's app for daily news and videos

Install App

చేపలు పట్టేలా.. పాముల్ని పడుతున్న ప్రియాంక గాంధీ.. వీడియో వైరల్

Webdunia
శుక్రవారం, 3 మే 2019 (11:48 IST)
కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీకి సంబంధించి వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ప్రియాంక గాంధీ చెరువు చేపలు పట్టేలా.. పాముల్ని పట్టేస్తున్నారు. ఈ వీడియోను చూసినవారంతా షాకవుతున్నారు. సాధారణంగా పాములంటే అందరూ జడుసుకుంటారు. అలాంటిది ఉత్తరప్రదేశ్ రాయ్‌బరేలీలో ఎన్నికల ప్రచారంలో నిమగ్నమయ్యారు. 
 
ఈ సందర్భంగా తొలుత చిన్నారులతో రాయ్‌బరేలీలో ముచ్చటించిన ప్రియాంక గాంధీ.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై నిప్పులు చెరిగారు. మోదీ చౌకీదార్ కాదని, ఆయనో దొంగ అని కామెంట్స్ చేశారు. ఈ కామెంట్లకు చిన్నారుల చప్పట్లతో ఆ ప్రాంతమంతా మారుమోగింది. ఆపై పాముల్ని ఆడిస్తూ జీవనం కొనసాగించే వారిని కలిశారు. వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు. 
 
ఈ క్రమంలో పాములోరి వద్ద వున్న పాములను బుట్ట నుంచి ఏమాత్రం భయం లేకుండా చేతులో పట్టుకున్నారు. ఈ సీన్‌ను చూసినవారంతా ప్రియాంక గాంధీ చెరువులో చేపలు పట్టినట్లు పాముల్ని పట్టేస్తుందే అని తెల్లబోయారు. ఈ వ్యవహారానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. 

సంబంధిత వార్తలు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments