Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉగ్రవాదుల ఆయుధం కంటే ప్రజల చేతిలోని ఓటు శక్తివంతం : నరేంద్ర మోడీ

Webdunia
మంగళవారం, 23 ఏప్రియల్ 2019 (10:13 IST)
పవిత్రమైన ఓటు హక్కును వినియోగించుకోవడం చాలా ఆనందంగా ఉందనీ, ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. 
 
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మంగళవారం దేశవ్యాప్తంగా మూడో దశ పోలింగ్ జరుగుతోంది. ఇందులోభాగంగా, గుజరాత్‌లోని అన్ని లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. దీంతో ప్రధాని నరేంద్ర మోడీ కూడా తన సొంతూరులో ఓటు హక్కును వినియోగించుకున్నారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఓ పాఠశాల బూత్‌లో ఆయన ఓటు వేశారు. 
 
ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ, ఓటు హక్కు వినియోగించుకుని తన కర్తవ్యాన్ని పూర్తి చేశానని చెప్పారు. కుంభమేళాలో పాల్గొన్నంత ఆనందంగా ఉందని.. పవిత్ర స్నానం తర్వాత ఎలాగైతే స్వచ్ఛతను పొందుతామో.. ఓటు వేసిన అనంతరం అలాంటి అనుభూతినే పొందుతామన్నారు. భారతీయ ఓటర్లు తెలివైనవారని.. ఎవరు సమర్థంగా పనిచేస్తారో వారికి తెలుసని మోడీ అన్నారు. 
 
'ఉగ్రవాదుల ఆయుధం ఎల్‌ఈడీ. ప్రజల ఆయుధం ఓటు. ఎల్‌ఈడీ కంటే ఓటే శక్తవంతం. అసలైన ఆయుధం ప్రజల వద్దే ఉంది. ఓటు సామర్థ్యాన్ని తెలుసుకోవాలి' అన్నారు. 21వ శతాబ్దంలో పుట్టినవారు ఈ ఎన్నికల్లో తొలిసారిగా ఓటు వేయబోతున్నారన్న మోడీ.. తమ భవిష్యత్త కోసం వారు ఖచ్చితంగా ఓటేయాలని పిలుపునిచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులపై స్పందించిన విజయ్ దేవరకొండ

Rashmika: విజయ్ దేవరకొండ ఇంట్లో ఫోటో షూట్ చేసిన రష్మిక- ఆ చీరను ఎవరిచ్చారు?

బీఎన్‌ రెడ్డి పురస్కారం ఎంతో గౌరవంగా భావిస్తున్నాను: దర్శకుడు సుకుమార్‌

సైనిక అధికారులకు కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రదానోత్సవం

కమెడియన్‌ ప్రవీణ్‌ బకాసుర రెస్టారెంట్‌ నుంచి జాతీయం లిరికల్‌ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments