Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజీవ్ ఆదేశాల మేరకే సిక్కుల ఊచకోత : బీజేపీ

Webdunia
గురువారం, 9 మే 2019 (13:39 IST)
మాజీ ప్రధాని దివంగత రాజీవ్ గాంధీని లక్ష్యంగా చేసుకుని భారతీయ జనతా పార్టీ సంచలన ఆరోపణలు చేస్తోంది. మొన్నటికిమొన్న రాజీవ్ గాంధీ నంబర్ వన్ అవినీతిపరుడంటూ ప్రధాని నరేంద్ర మోడీ ఆరోపించారు. నిన్న భారత రక్షణ శాఖకు చెందిన ఐఎన్ఎస్ విరాట్ యుద్ధ నౌకను రాజీవ్ ఫ్యామిలీ ఓ ట్యాక్సీలా వాడుకుందని చెప్పారు. ఇపుడు మరో అడుగు ముందుకేసి బీజేపీ.. రాజీవ్ ఆదేశాల మేరకే సిక్కులు ఊచకోత జరిగినట్టు ఆరోపించారు.
 
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా, పంజాబ్‌ రాష్ట్రంలోని 13 పార్లమెంటరీ నియోజకవర్గాలలో మే 19వ తేదీన పోలింగ్ జరుగనుంది. ఈ సందర్భంగా సిక్కుల ఊచకోత అంశాన్ని బీజేపీ తెరపైకి తెచ్చింది. 1984లో దివంగత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హత్య చేసిన అనంతరం సిక్కులను ఊచకోత కోశారు. అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ ఆఫీసు నుంచి వచ్చిన ఆదేశాల మేరకు సిక్కులను ఊచకోత కోశారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. 
 
ఇప్పటికే రాజీవ్ గాంధీపై బీజేపీ నేతలు చేసిన విమర్శలకు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కౌంటర్ ఇస్తూనే ఉన్నారు. "మోడీ… నీ కర్మఫలం ఎదురు చూస్తోంది" అని రాహుల్ తాజాగా విమర్శలు చేశారు. సిక్కుల ఊచకోత అంశాన్ని బీజేపీ రాజకీయంగా వాడుకోవాలనే చూస్తే… కాంగ్రెస్ నేతలు కౌంటర్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అసలు మీ సమస్య ఏంటి? జర్నలిస్టుపై మండిపడిన పూజాహెగ్డే

పూజా హెగ్డేలో ప్రేమలో పడింది.. ఘాటుగా లిప్ కిస్.. ట్రెండింగ్‌లో బుట్టబొమ్మ (video)

సెల్ఫీ కోసం వచ్చిన మహిళా ఫ్యాన్స్‌కు ముద్దు పెట్టిన ఉదిత్.. ఏకంగా లిప్ లాక్ (video)

పుష్ప 2కు ముందే వైల్డ్ ఫైర్ షో చేశాం - సినిమాలూ చేస్తున్నా : ఫరియా అబ్దుల్లా

తనికెళ్ల భరణి ప్రధాన పాత్రలో క్రైమ్ థ్రిల్లర్ అసుర సంహారం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్ట్రాబెర్రీలు తింటే 7 ఆరోగ్య ప్రయోజనాలు

ఆడోళ్లకు కూడా కండోమ్స్ వచ్చేశాయి.. ఎలా వాడాలో తెలుసా?

మండుతున్న అగ్నిగోళం నుంచి చందమామ చల్లగా ఎలా మారాడు? 4.5 బిలియన్ ఏళ్ల క్రితం (video)

ఆటలో అరటి పండు కాదు ఆరోగ్యానికి అరటి పండు

ఆత్రేయపురం పూతరేకులను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments