Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమించాలంటూ సైకో వేధింపులు... భరించలేక యువతి సూసైడ్

Webdunia
గురువారం, 9 మే 2019 (13:30 IST)
ప్రేమించాలంటూ ఓ సైకో పెట్టిన వేధింపుల వల్ల ఓ యువతి బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషాదకర ఘటన బెంగుళూరులో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, బెంగుళూరు నగరంలోని కేఆర్‌ పురానికి చెందిన లీనా(17) అనే యువతి తన తల్లిదండ్రులతో కలిసి నివశిస్తోంది. 
 
ఈమె రామ్మూర్తినగర్‌లోని ఓ ప్రైవేటు కాలేజీ పీయూసీ చదువుతోంది. ఇదే కాలేజీకి చెందిన మంజునాథ్ అనే యువకుడు తనను ప్రేమించాలని లీనా వెంటపడటం మొదలుపెట్టాడు. తనకు ఇలాంటివి ఇష్టం లేదని చెప్పినా వినిపించుకోకుండా వెంటపడి వేధించడం మొదలుపెట్టాడు. ఒక విధంగా చెప్పాలంటే సైకోలా ప్రవర్తించసాగాడు. 
 
దీంతో మానసికంగా కుంగిపోయిన లీనా మంగళవారం రాత్రి ఇంట్లో ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ నేపథ్యంలో లీనా తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసిన పోలీసులు, నిందితుడిని అరెస్ట్ చేశారు. లీనాను మంజునాథ్ బెదిరిస్తున్న సీసీటీవీ ఫుటేజీని స్వాధీనం చేసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Harihara Veeramallu: పారితోషికం మొత్తం తిరిగి ఇచ్చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్?!!

షూటింగులకు వాడే డ్రోన్లతో కూల్చివేశారు - ఆర్జీవీ

34 మంది పిల్లలకు తల్లి అయిన ప్రీతి జింటా

Kingdom: మీ కింగ్ డమ్ 30 రోజుల్లో వచ్చేస్తున్నాడు సిద్ధంకండి : విజయ్ దేవరకొండ

Bunny Vas: బన్నీ వాస్ చిత్రం మ్యాడ్ నెస్ ముసుగు వ్యక్తుల కథేమిటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments