మోడీ ఓబీసీ అయితే ప్రధానిగా ఆర్ఎస్ఎస్ అంగీకరించేదా? మాయావతి

Webdunia
శుక్రవారం, 10 మే 2019 (15:30 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై బీఎస్పీ అధినేత్రి, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ వెనుకబడిన కులం వ్యక్తికాదన్నారు. ఆయన ఓబీసీ అయితే దేశ ప్రధానిగా ఆర్ఎస్ఎస్ అంగీకరించేదా అని ఆమె ప్రశ్నించారు. 
 
సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా మాయావతి మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోడీ ఓబీసీ కాదన్నారు. ఆయన వెనుకబడిన కులం నేత అయితే ఆర్ఎస్ఎస్ ఆయనను ప్రధానిగా అంగీకరించేదే కాదన్నారు. అణగారిన వర్గాల ప్రజలు బాధలు, సమస్యలు మోడీకి తెలియవన్నారు. 
 
గుజరాత్ రాష్టరంలో దళితులపై దాడులు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దళితులు పెళ్లి చేసుకుంటే, వారు గుర్రపు బగ్గీలపై ఊరేగకుండ అగ్రవర్ణాల వారు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. బీఎస్పీ - ఎస్పీ పొత్తును కులాల కూటమిగా మోడీ అభివర్ణించడాన్ని ఆమె తప్పుబట్టారు. ఆయన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. 
 
ఈనెల 23వ తేదీన వెల్లడయ్యే ఎన్నికల ఫలితాల్లో బీజేపీతో పాటు.. మోడీకి షాక్ తప్పదన్నారు. మోడీని మళ్లీ ప్రధానిని చేసేందుకు దేశ ప్రజలు సిద్ధంగా లేరని ఆమె స్పష్టం చేశారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో తమ కూటమి అత్యధిక స్థానాలను గెలుచుకుంటుందని మాయావతి జోస్యం చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Niharika NM: ఫెయిల్యూర్స్ వస్తే బాధపడతా.. వెంటనే బయటకు వచ్చేస్తా : నిహారిక ఎన్ ఎం.

Akshay Kumar: హైవాన్ క్యారెక్టర్ అనేక అంశాల్లో నన్ను ఆశ్చర్యపరిచింది : అక్షయ్ కుమార్

Srinidhi Shetty: శ్రీనిధి శెట్టి నుదుటిపై గాయం ఎందుకయింది, ఎవరు కొట్టారు...

Venky 77: వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో మల్లీశ్వరీ సీక్వెల్ !

Janhvi : రామ్ చరణ్, జాన్వీ కపూర్ పై పెద్ది కోసం పూణేలో సాంగ్ షూటింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దీపావళి డ్రెస్సింగ్, డెకర్: ఫ్యాబ్ఇండియా స్వర్నిమ్ 2025 కలెక్షన్‌

ధ్యానంతో అద్భుతమైన ప్రయోజనాలు

రష్మిక మందన్న, ప్రముఖ క్రియేటర్‌లతో జతకట్టిన క్రాక్స్

గ్యాస్ట్రిక్ సమస్యలు వున్నవారు ఎలాంటి పదార్థాలు తీసుకోకూడదు?

బొబ్బర్లు లేదా అలసందలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments