మోడీ ఓబీసీ అయితే ప్రధానిగా ఆర్ఎస్ఎస్ అంగీకరించేదా? మాయావతి

Webdunia
శుక్రవారం, 10 మే 2019 (15:30 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై బీఎస్పీ అధినేత్రి, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ వెనుకబడిన కులం వ్యక్తికాదన్నారు. ఆయన ఓబీసీ అయితే దేశ ప్రధానిగా ఆర్ఎస్ఎస్ అంగీకరించేదా అని ఆమె ప్రశ్నించారు. 
 
సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా మాయావతి మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోడీ ఓబీసీ కాదన్నారు. ఆయన వెనుకబడిన కులం నేత అయితే ఆర్ఎస్ఎస్ ఆయనను ప్రధానిగా అంగీకరించేదే కాదన్నారు. అణగారిన వర్గాల ప్రజలు బాధలు, సమస్యలు మోడీకి తెలియవన్నారు. 
 
గుజరాత్ రాష్టరంలో దళితులపై దాడులు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దళితులు పెళ్లి చేసుకుంటే, వారు గుర్రపు బగ్గీలపై ఊరేగకుండ అగ్రవర్ణాల వారు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. బీఎస్పీ - ఎస్పీ పొత్తును కులాల కూటమిగా మోడీ అభివర్ణించడాన్ని ఆమె తప్పుబట్టారు. ఆయన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. 
 
ఈనెల 23వ తేదీన వెల్లడయ్యే ఎన్నికల ఫలితాల్లో బీజేపీతో పాటు.. మోడీకి షాక్ తప్పదన్నారు. మోడీని మళ్లీ ప్రధానిని చేసేందుకు దేశ ప్రజలు సిద్ధంగా లేరని ఆమె స్పష్టం చేశారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో తమ కూటమి అత్యధిక స్థానాలను గెలుచుకుంటుందని మాయావతి జోస్యం చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pothana Hema: దుఃఖాన్ని బలంగా మార్చుకుని మదం తో ముందుకుసాగుతున్న పోతన హేమ

Richard Rishi: ద్రౌప‌ది 2 నుంచి నెల‌రాజె... మెలోడీ సాంగ్‌

Karti : అన్నగారు నే రిచ్ కిడ్డు, రాజమౌళికి ఫోన్ చేసి బయోపిక్ తీయమంటున్న.. కార్తి పై సాంగ్

Dil Raju: పుకార్ల పై నిర్మాత దిల్ రాజు అధికారిక ప్రకటన

Samantha: సమంత- రాజ్ వివాహం.. శామ్ చేతిలో మెరిసిన డైమండ్ రింగ్ గురించి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments