చైనా దిగుమతులపై భారీగా సుంకాలు పెంపు

Webdunia
శుక్రవారం, 10 మే 2019 (15:16 IST)
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అన్నంతపని చేశారు. తన హెచ్చరికలను కాలరాసి ఇరాన్ నుంచి చైనా చమురును దిగుమతి చేస్తోంది. దీనిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ఆంక్షలను బేఖాతర్ చేసిన పక్షంలో భారీ మొత్తంలో సుంకాలు వసూలు చేస్తామని ట్రంప్ హెచ్చరిస్తూ వచ్చారు. ఆ విధంగానే ఆయన హెచ్చరించారు. 
 
చైనా దిగుమతులపై సుంకాలను 200 బిలియన్ డాలర్ల మేర పెంచారు. పలు వస్తువులపై 10 నుంచి 25 శాతం వరకు సుంకాలను పెంచేశారు. ట్రంప్ ప్రభుత్వం నిర్ణయం పట్ల చైనా అదే స్థాయిలో స్పందించింది. ఇరు దేశాల మధ్య సమస్యల పరిష్కారానికి సుంకాల పెంపు సరైన చర్య కాదని తెలిపింది. 
 
అమెరికా తీరు చైనాకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తుందని చెప్పింది. తన నిర్ణయాన్ని అమెరికా పున:సమీక్షించుకోవాలని... లేని పక్షంలో తాము కూడా అదే స్థాయిలో ప్రతిస్పందిస్తామని తెలిపింది. అమెరికా తీసుకున్న నిర్ణయం ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర ప్రభావం చూపుతుందని, ప్రపంచ వృద్ధి రేటు కుదుపుకు గురవుతుందని చైనా ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టీనేజ్ నాగార్జున అంటే పిచ్చి ప్రేమ : నటి కస్తూరి

బాలీవుడ్ బిగ్ బికి భద్రత పెంపు : కేంద్రం కీలక నిర్ణయం

RP Patnaik: బాపు సినిమా అవకాశం రాకపోయినా ఆ కోరిక తీరింది : ఆర్.పి పట్నాయక్

Prashanth Varma:, ప్రశాంత్ వర్మ నిర్మాతలను మోసం చేశాడా? డివివి దానయ్య ఏమంటున్నాడు?

భయపెట్టేలా రాజేష్ ధ్రువ... సస్పెన్స్, థ్రిల్లర్.. పీటర్ టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

తర్వాతి కథనం
Show comments