Webdunia - Bharat's app for daily news and videos

Install App

లోక్‌సభ ఎన్నికలు : 26న వారణాసిలో మోడీ నామినేషన్ దాఖలు

Webdunia
గురువారం, 25 ఏప్రియల్ 2019 (11:58 IST)
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఇప్పటివరకు మూడు దశల ఎన్నికల పోలింగ్ ముగిసింది. అయితే, ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇందులోభాగంగా ఆయన గురువారం వారణాసిలో రోడ్‌షో నిర్వహించనున్నారు. 
 
బీజేపీ అభ్యర్ధిగా వారణాసి లోక్‌సభ స్థానం నుంచి రెండోసారి పోటీ చేస్తున్న ప్రధాని మోడీ.. గురువారం మధ్యాహ్నం 12 గంటలకు వారణాసి చేరుకోనున్నారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి బెనారస్ హిందూ యూనివర్సిటీ గేట్ నుంచి ప్రధాని నరేంద్ర మోడీ ర్యాలీ నిర్వహిస్తారు. ఈ ర్యాలీ పురాతన మందిరాలు, గంగా నది ఘాట్లను కలుపుతూ ముందుకు సాగనుంది. 
 
ఈ ర్యాలీలో బీజేపీ సీనియర్ నేతలు, ఎన్డీయే మిత్రపక్షాలకు చెందిన నేతలు కూడా పాల్గొననున్నారు. 'దశాశ్వమేథ్' ఘాట్ వద్ద సాయంత్రం 7 గంటలకు ర్యాలీ ముగించి గంగా హారతిలో పాల్గొంటారు. మోడీ. నగరంలోని ప్రముఖులను ఉద్దేశించి ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో ఆయన ప్రసంగించనున్నారు. 
 
ఇక శుక్రవారం నామినేషన్ దాఖలు చేస్తారు. నామినేషన్ వేసే ముందు ఉదయం 9 గంటల సమయంలో బీజేపీ కార్యకర్తలతో సమావేశం కానున్నారు. అనంతరం కాలభైరవ ఆలయంలో పూజలు చేసి కలెక్టరేట్‌లో నామినేషన్ పత్రాలను సమర్పిస్తారు. నామినేషన్ సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ వెంట బీజేపీ నేతలతో సహా, ఉద్దవ్ థాక్రే, నితీశ్ కుమార్ వంటి ఎన్డీయే మిత్రపక్షాలకు చెందిన ప్రముఖ నేతలు హాజరయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

టైటిల్ & ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానున్న రవితేజ 76వ చిత్రం

సుహాస్‌ చిత్రం ఓ భామ అయ్యో రామ లో దర్శకుడు హరీష్ శంకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments