ముస్లిం ఓట్లు చీల్చవద్దంటూ సిద్ధూ వ్యాఖ్యలు.. ప్రచారంపై ఈసీ నిషేధం

Webdunia
మంగళవారం, 23 ఏప్రియల్ 2019 (09:58 IST)
కాంగ్రెస్ నేత, పంజాబ్ రాష్ట్ర మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఎన్నికల ప్రచారంపై ఎన్నికల సంఘం నిషేధం విధించింది. ముస్లిం ఓట్లు చీల్చవద్దంటూ ఆయన చేసిన విజ్ఞప్తిని ఎన్నికల కోడ్ ఉల్లంఘనగా పరిగణించిన ఎన్నికల సంఘం ఆయనపై 72 గంటలపాటు ప్రచారంపై నిషేధం విధించింది.
 
ఈ వివరాలను పరిశీలిస్తే, బీహార్‌లోని కతిహార్‌లో సిద్ధూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముస్లింలు ఓట్లు చీల్చవద్దని కోరారు. 'నేను ముస్లిం సోదరులకు ఒక విషయం చెప్పదలిచాను. అసదుద్దీన్ ఒవైసీ వంటి నేతలను ఇక్కడికి తీసుకొచ్చి మిమ్మల్ని విభజించాలని చూస్తున్నారు. కొత్త పార్టీ పెట్టి మీ ఓట్లు చీల్చి, విజయం సాధించాలని చూస్తున్నారు' అని  వ్యాఖ్యానించారు. 
 
ఇక్కడ ముస్లిం జనాభా 65 శాతం ఉందని, అందరూ ఐక్యంగా ఉండటం వల్ల మైనారిటీలు కాస్తా మెజారిటీగా ఉండొచ్చన్నారు. అదే జరిగితే పరిస్థితుల్లో మార్పు వస్తుందని, ప్రధాని నరేంద్ర మోడీ ఓడిపోతారంటూ జోస్యం చెప్పారు. దీనిపై బీజేపీ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. సిద్ధూ ప్రసంగం ఎన్నికల నియమావళికి విరుద్ధంగా ఉందంటూ అందులో పేర్కొంది. సిద్ధు వ్యాఖ్యలను ఎన్నికల సంఘం ఖండిస్తూనే, 72 గంటలపాటు ప్రచారం చేయకుండా నిషేధం విధించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వీధికుక్కలు దేశంలో ఎవరిని కరిచినా నన్నే నిందిస్తున్నారు : అక్కినేని అమల

సోషల్ మీడియాలో కీర్తి సురేష్ మార్ఫింగ్ ఫోటోలు... బోరుమంటున్న నటి

మీకు దణ్ణం పెడతా, నేను సన్యాసం తీసుకోవట్లేదు: రేణూ దేశాయ్ (video)

Joy Crizildaa: నీకు దమ్ముంటే డీఎన్ఏ టెస్టుకు రావయ్యా.. మాదంపట్టికి జాయ్ సవాల్

NC24: నాగ చైతన్య, మీనాక్షి చౌదరి చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments