Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాషాయ దళంలోకి జయప్రద.. అజంఖాన్‌పై పోటీ?

Webdunia
సోమవారం, 25 మార్చి 2019 (15:42 IST)
ప్రముఖ సినీ నటి జయప్రద భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ మేరకు జాతీయ చానెల్ ఒకటి వార్తను ప్రచారం చేసింది. గతంలో సమాజ్‌వాదీ పార్టీ తరపున బరిలోకి దిగిన ఆమె ఎంపీగా గెలుపొందారు. ఆ తర్వాత ఆ పార్టీకి దూరంగా ఉంటున్నారు. ముఖ్యంగా, ఆ పార్టీ సీనియర్ నేత అమర్ సింగ్ క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉండటంతో జయప్రద కూడా దూరమయ్యారు. 
 
గత కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న జయప్రద... ఇపుడు భారతీయ జనతా పార్టీలో చేరేందుకు సిద్ధమైనట్టు సమాచారం. ఒకవేళ ఆమె బీజేపీలో చేరితే తన చిరకాల రాజకీయ ప్రత్యర్థి ఆజమ్‌ ఖాన్‌పై పోటీ చేసే అవకాశాలున్నాయి. రామ్‌పూర్‌ స్థానం నుంచి ఆమె బరిలోకి దిగే అవకాశముంది. రాష్ట్ర మాజీ మంత్రి ఆజమ్‌ ఖాన్‌ను ఈసారి రామ్‌పూర్‌ నుంచి సమాజ్‌వాది పార్టీ ఎంపీగా పోటీ చేస్తున్న విషయం తెల్సిందే.
 
గత 2009లో జరిగిన ఎన్నికల్లో జయప్రద ఈ స్థానం నుంచి 30 వేల మెజార్టీతో ఎంపీగా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఆజమ్‌ ఖాన్‌కు, జయప్రదకు మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం జరిగింది. ఆమ్‌ఖాన్‌ను ఖల్జిగా జయప్రద అభివర్ణించింది. తన నగ్న ఫొటోలంటూ కొన్నింటిని ఓటర్లకు పంచారని, తనపై యాసిడ్‌ దాడికి ఆజమ్‌ ఖాన్‌ ప్రయత్నించారంటూ ఆరోపించారు. ఇపుడు ఆమె గనుకు బీజేపీలో చేరి రామ్‌పూర్‌ నుంచి బరిలోకి దిగితే... పోటీ తీవ్రస్థాయిలో ఉండే అవకాశముంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Havish: కీలక సన్నివేశాల చిత్రీకరణలో హవీష్, కావ్య థాపర్ ల నేను రెడీ

ప్రియదర్శి, నిహారిక ఎన్.ఎం. నటించిన మిత్ర మండలి దీపావళికి రాబోతోంది

రహస్యంగా పెళ్లి చేసుకున్న బాలీవుడ్ నటి!

కర్నాటక సీఎం సిద్ధూతో చెర్రీ సమావేశం.. ఫోటోలు వైరల్

నేటి ట్రెండ్ కు తగ్గట్టు కంటెంట్ సినిమాలు రావాలి : డా: రాజేంద్ర ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments