Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీకి ఎన్నికల ఏజెంటుగా రాముడు.. ప్రజాస్వామ్యం దెబ్బ రుచిచూపిస్తా : మమత వార్నింగ్

Webdunia
మంగళవారం, 7 మే 2019 (19:54 IST)
భారతీయ జనతా పార్టీకి ఎన్నికలకు ముందు మాత్రమే రాముడు గుర్తుకు వస్తాడని, అంటే రాముడిని బీజేపీ ఎన్నికల ఏజెంటుగా మార్చివేసిందని వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. 
 
సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా, పురూలియాలో జరిగిన సభలో ఆమె పాల్గొని బీజేపీపై నిప్పులు చెరిగారు. ముఖ్యంగా, తృణమూల్ కాంగ్రెస్ పార్టీని నరేంద్ర మోడీ టోల్ కలెక్టర్‌గా అభివర్ణించడాన్ని ఆమె తీవ్రంగా తప్పుబట్టారు. 
 
ఈ సార్వత్రిక ఎన్నికల్లో ప్రజాస్వామ్యం గొప్పతనం, ప్రజాస్వామ్యం సత్తా ఏమిటో ప్రధానికి రుచి చూపిస్తానని ఆమె చెప్పారు. అంతేకాకుండా, ఈ ఎన్నికల్లో అక్రమ మార్గంలో, కేంద్ర బలగాలను ఉపయోగించి ఓటర్లతో బలవంతంగా బీజేపీకి ఓట్లు వేయించుకుంటున్నారని ఆరోపించారు. 
 
అదేసమయంలో బీజేపీ నేతలకు ఎన్నికలకు ముందు మాత్రమే రాముడు గుర్తుకు వస్తారన్నారు. అంటే.. రాముడిని బీజేపీ ఓ ఎన్నికల ఏజెంటుగా ఉపయోగించుకుంటుందంటూ ధ్వజమెత్తారు. ఎన్నికల ముందు రాముడి గుడి కట్టితీరుతామని హడావుడి చేసే బీజేపీ నేతలు.. అధికారంలోకి వచ్చాక దేశంలో ఒక్క రామాలయమైనా కట్టించారా అని మమతా బెనర్జీ సూటిగా ప్రశ్నించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

టైటిల్ & ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానున్న రవితేజ 76వ చిత్రం

సుహాస్‌ చిత్రం ఓ భామ అయ్యో రామ లో దర్శకుడు హరీష్ శంకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments