ఆన్‌లైన్ క్లాసులు.. పిల్లల్లో ఆసక్తి లేదు.. తల్లిదండ్రులకు తలనొప్పి..

Webdunia
శుక్రవారం, 5 జూన్ 2020 (11:26 IST)
Online Classes
కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ దేశాలు లాక్ డౌన్‌లో వున్నాయి. ఫలితంగా పాఠశాలలు మూతపడ్డాయి. విద్యార్థులు ఇంటి పట్టునే వుండి చదువుకునే పరిస్థితి ఏర్పడింది. ఫలితంగా పాఠశాలల యాజమాన్యాలు ఆన్ లైన్‌ క్లాసులు నిర్వహిస్తున్నాయి. పిల్లలు ఆన్‌లైన్ క్లాసులకు హాజరయ్యేలా విద్యార్థుల తల్లిదండ్రులు, టీచర్లు చూడాలని పాఠశాలల యాజమాన్యాలు విజ్ఞప్తి చేస్తున్నారు. 
 
ప్రస్తుత కరోనా వైరస్ నేపథ్యంలో సామాజిక దూరం పాటించి సాధారణ తరగతులు నిర్వహించడం సాధ్యం కాదని పేర్కొన్నారు. ఒకవేళ తరగతులు నిర్వహిస్తే వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉందన్నారు. కాబట్టి విద్యార్థులకు ఇబ్బంది లేకుండా చదువులు కొనసాగిస్తామని పాఠశాల యాజమాన్యాలు హామీ ఇస్తున్నాయి. కానీ ఆన్ లైన్ క్లాసులు చెబుతున్న యాజమాన్యం… పిల్లలకి అవి అర్థం అవుతున్నాయో లేదో కూడా పట్టించుకోవడం లేదు. 
 
అంతేకాకుండా హోంవర్క్ అని భయంకరంగా వర్క్ ఇవ్వటంతో పిల్లలు ఆన్ లైన్ క్లాసులు విషయంలో సరిగ్గా శ్రద్ధ చూపడం లేదు. కొంతమంది పిల్లల తల్లిదండ్రులకు సరైన అవగాహన టెక్నాలజీపై లేకపోవడంతో… అటువంటి పిల్లలు క్లాసులు మిస్ అవుతున్నారు. మరోపక్క ఈ క్లాసులు జరుగుతున్న తరుణంలో ఉద్యోగం లేక ఉపాధి లేక ఇళ్లలో ఉన్న పిల్లల తల్లిదండ్రులను స్కూల్ యాజమాన్యాలు ఫీజులు అడుగుతున్నాయి.
 
దీంతో చాలా వరకు తల్లిదండ్రులు స్కూల్ యాజమాన్యాలు ప్రవర్తించిన తీరుపై  మండిపడుతున్నారు. పనులు లేక ఇంట్లో తినటానికి తిండి లేక ఉన్న సమయంలో మిమ్మల్ని ఆన్‌లైన్ క్లాసులు ఎవరు చెప్పమన్నారు మమ్మల్ని స్కూల్ ఫీజు ఎందుకు అడుగుతున్నారు అంటూ విమర్శలు చేస్తున్నారు. దీంతో కరోనా ఎఫెక్ట్‌తో పిల్లలకి ఆన్‌లైన్ క్లాసుల విషయంలో సరైన ప్లానింగ్ లేక స్కూల్ యాజమాన్యాలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఇంకా ఈ ఆన్‌లైన్ క్లాసుల ద్వారా తల్లిదండ్రులు, పిల్లలు నానా తంటాలు పడుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

నిర్మలమ్మ పద్దు 140 కోట్ల మంది ఆకాంక్షలకు ప్రతిబింభం : ప్రధాని మోడీ

నిర్మలమ్మ ఆర్థిక పద్దు... ఆదాయ పన్ను స్లాబుల్లో ఎలాంటి మార్పు లేదు

కేంద్ర బడ్జెట్ 2026-27 : ఏప్రిల్ 1వ తేదీ నుంచి కొత్త ఆదాయ పన్ను చట్టం 2025 అమలు

కేంద్ర బడ్జెట్ 2026-27 : దేశంలో 7 హై స్పీడ్ రైలు కారిడార్లు అభివృద్ధి

రికార్డు స్థాయిలో లోక్‌సభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన విత్తమంత్రి నిర్మలమ్మ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగా ఫ్యామిలీకి వారసుడొచ్చాడు.. తల్లీబిడ్డా ఆరోగ్యంగా ఉన్నారు : చిరంజీవి

మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. రామ్ చరణ్, ఉపాసన దంపతులకు కవల పిల్లలు పుట్టారోచ్

ఫంకీ లో రట్టాటటావ్ గీతంలో విశ్వక్ సేన్, కయాదు లోహర్‌ కెమిస్ట్రీ వన్నెతెచ్చింది

NagAswin: నాగ్ అశ్విన్, సింగీతం శ్రీనివాసరావు, దేవి శ్రీ ప్రసాద్ కాంబినేషన్ చిత్రం షురూ

'జన నాయగన్' నిర్మాతకు తీవ్ర నష్టం జరుగుతోంది : హీరో విజయ్

తర్వాతి కథనం
Show comments