Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిల్లలు క్యారట్, చీజ్, పాలు.. ఎందుకు తీసుకోవాలో తెలుసా?

Webdunia
బుధవారం, 17 ఏప్రియల్ 2019 (18:12 IST)
పౌష్టికాహార లోపం వల్ల బలహీనంగా ఉండే పిల్లలను చాలా మందిని చూసుంటాం. సరైన ఆహారం తినకపోవడం వల్ల సన్నగా తయారవ్వడం, చలాకీతనం లేకపోవడం, ఎదుగుదల సరిగ్గా లేకపోవడం జరుగుతుంది. వీటికితోడు నిరుత్సాహం, బద్దకం కూడా అంటుకుంటాయి. ముఖ్యంగా టీనేజ్ వయస్సులో ఉన్న పిల్లలు మంచి ఆహారం తీసుకోకపోతే ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. 
 
ముఖ్యంగా వారు ఎలాంటి ఆహారం తీసుకోవాలో చూద్దాం. పిల్లల శారీరక, మానసిక ఎదుగుదలకి విటమిన్ ఎ బాగా ఉపయోగపడుతుంది. కంటి చూపును మెరుగుపరచడంలో, ఎముకలకు బలాన్ని ఇవ్వడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా క్యారట్, చీజ్, పాలు, గుడ్డులో విటమిన్ ఎ పుష్కలంగా లభిస్తుంది. వీటిని క్రమం తప్పకుండా తింటే మంచిది. టమోటాలు, తాజా కూరగాయలలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది శరీర ధృడత్వానికి, అందమైన చర్మాన్ని పొందటానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. 
 
విటమిన్ సి పుష్కలంగా లభించే నిమ్మజాతి పండ్లను పిల్లలకు తరచూ ఇస్తుండాలి. పిల్లలలో రక్తం పట్టడానికి ఐరన్ ఎంతగానో దోహదం చేస్తుంది. ఇందుకోసం పాలకూర, ఎండుద్రాక్ష, బీన్స్ వంటివి తరచూ పిల్లలకు పెట్టాలి. దీని వలన పిల్లలు ఎంతో ఉత్సాహంగా తయారవుతారు. పిల్లలకు సరైన పోషకాహారం ఇవ్వడం వలన ఆరోగ్యంగా ఉంటారు. మెదడు చురుగ్గా పనిచేస్తుంది. చదువులు, ఆటల్లో రాణించగలుగుతారు.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments