Webdunia - Bharat's app for daily news and videos

Install App

శామ్‌సంగ్ ''సారీ'' చెప్పింది.. ఎవరికో తెలుసా?

Webdunia
శుక్రవారం, 23 నవంబరు 2018 (16:26 IST)
అతిపెద్ద మొబైల్ ఫోన్ల ఉత్పత్తి సంస్థ, చిప్ మేకర్ అయిన శామ్‌సంగ్ సారీ చెప్పింది. ఎందుకు.. ఎవరికి అని తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే. శామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్ సంస్థ తమ ఫ్యాక్టరీలలో పనిచేసే కార్మికులకు క్షమాపణలు చెప్పింది.


క్యాన్సర్ బాధితులు కూడా సెమీకండెక్టర్ ఫ్యాక్టరీలలో పనిచేస్తున్నారని తెలిసి సంస్థ యాజమాన్యం క్షమాపణలు వేడుకుంది. తమ సంస్థల్లో అనారోగ్యాలతో పనిచేసే కార్మికులకు వారి కుటుంబాలకు బేషరతుగా క్షమాపణలు చెప్తున్నామని సంస్థ ఉపాధ్యక్షుడు కిమ్ కి-నామ్ అన్నారు. 
 
సెమీకండెక్టర్, ఎల్సీడీ ఫ్యాక్టరీల్లో పనిచేసే కార్మికుల ఆరోగ్య బీమా కల్పించడంలో విఫలమైనట్లు కిమ్ ఒప్పుకున్నాడు. సంస్థ మాజీ అధ్యక్షుడు పార్క్- గెన్ అవినీతి కారణంగా ఈ తప్పు జరిగిపోయిందన్నారు. కానీ 240 మంది కార్మికులు తమ ఫ్యాక్టరీలలో పనిచేయడం ద్వారా పని ఆధారిత వ్యాధులతో బాధపడుతున్నారని చెప్పారు. ఇంకా 80 మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. 
 
ఫలితంగా శామ్‌సంగ్ గ్రూపు నష్టపరిహారంగా 150 మిలియన్లు చెల్లించనుందని కిమ్ వెల్లడించారు. ఇందులో ఆరోగ్య బీమా కింద 16 రకాల వ్యాధులను నయం చేసుకునేందుకు నగదును పొందవచ్చు. సెమీకండెక్టర్‌లో పనిచేసే కార్మికులు క్యాన్సర్ వ్యాధితో అత్యధికంగా మరణిస్తున్నారని తెలిసిందని.. ఇకపై శామ్‌సంగ్ కార్మికుల ఆరోగ్యంపై సంస్థ నిర్లక్ష్యంగా వ్యవహరించదని ఆయన చెప్పుకొచ్చారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments