Webdunia - Bharat's app for daily news and videos

Install App

శామ్‌సంగ్ ''సారీ'' చెప్పింది.. ఎవరికో తెలుసా?

Webdunia
శుక్రవారం, 23 నవంబరు 2018 (16:26 IST)
అతిపెద్ద మొబైల్ ఫోన్ల ఉత్పత్తి సంస్థ, చిప్ మేకర్ అయిన శామ్‌సంగ్ సారీ చెప్పింది. ఎందుకు.. ఎవరికి అని తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే. శామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్ సంస్థ తమ ఫ్యాక్టరీలలో పనిచేసే కార్మికులకు క్షమాపణలు చెప్పింది.


క్యాన్సర్ బాధితులు కూడా సెమీకండెక్టర్ ఫ్యాక్టరీలలో పనిచేస్తున్నారని తెలిసి సంస్థ యాజమాన్యం క్షమాపణలు వేడుకుంది. తమ సంస్థల్లో అనారోగ్యాలతో పనిచేసే కార్మికులకు వారి కుటుంబాలకు బేషరతుగా క్షమాపణలు చెప్తున్నామని సంస్థ ఉపాధ్యక్షుడు కిమ్ కి-నామ్ అన్నారు. 
 
సెమీకండెక్టర్, ఎల్సీడీ ఫ్యాక్టరీల్లో పనిచేసే కార్మికుల ఆరోగ్య బీమా కల్పించడంలో విఫలమైనట్లు కిమ్ ఒప్పుకున్నాడు. సంస్థ మాజీ అధ్యక్షుడు పార్క్- గెన్ అవినీతి కారణంగా ఈ తప్పు జరిగిపోయిందన్నారు. కానీ 240 మంది కార్మికులు తమ ఫ్యాక్టరీలలో పనిచేయడం ద్వారా పని ఆధారిత వ్యాధులతో బాధపడుతున్నారని చెప్పారు. ఇంకా 80 మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. 
 
ఫలితంగా శామ్‌సంగ్ గ్రూపు నష్టపరిహారంగా 150 మిలియన్లు చెల్లించనుందని కిమ్ వెల్లడించారు. ఇందులో ఆరోగ్య బీమా కింద 16 రకాల వ్యాధులను నయం చేసుకునేందుకు నగదును పొందవచ్చు. సెమీకండెక్టర్‌లో పనిచేసే కార్మికులు క్యాన్సర్ వ్యాధితో అత్యధికంగా మరణిస్తున్నారని తెలిసిందని.. ఇకపై శామ్‌సంగ్ కార్మికుల ఆరోగ్యంపై సంస్థ నిర్లక్ష్యంగా వ్యవహరించదని ఆయన చెప్పుకొచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ నలుగురులో నేను లేను... ఆ నిర్ణయం దుస్సాహసమే : అల్లు అరవింద్

ముఖ్యమంత్రిని కావాలన్న లక్ష్యంతో రాజకీయాల్లోకి రాలేదు : కమల్ హాసన్

సినిమావోళ్లకు కనీస కామన్ సెన్స్ లేదు : నిర్మాత నాగవంశీ

బలగం నటుడు జీవీ బాబు మృతి

అలాంటి వ్యక్తినే ఇరిటేట్ చేశామంటే... మన యానిటీ ఎలా ఉంది? బన్నీ వాసు ట్వీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Tea Bags- టీ బ్యాగుల్లో టీ సేవిస్తున్నారా?

ఆహారంలో చక్కెరను తగ్గిస్తే ఆరోగ్య ఫలితాలు ఇవే

Fish vegetarian: చేపలు శాకాహారమా? మాంసాహారమా?

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

తర్వాతి కథనం
Show comments