Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముస్లింను కించపరిచేలా వున్న పబ్జీ గేమ్‌.. యువతను తప్పుదోవ పట్టించేందుకే?

Webdunia
బుధవారం, 5 జూన్ 2019 (11:57 IST)
ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయిన పబ్జీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. అయితే ఈ పబ్జీ గేమ్ ఆడుతూ యువకులు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా ఈ పబ్జీ గేమ్‌పై ముస్లింలు అభ్యంతరం వ్యక్తం చేశారు. పబ్జీ గేమ్ ఇస్లాం మతాన్ని కించపరిచేలా వుందని తమిళనాడు ముస్లిం లీగ్ సమాఖ్య అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనిపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. 
 
పబ్జీ అనే ఈ వీడియో గేమ్‌కు పిల్లలు అడిక్ట్ అవుతున్నారని.. బాలురే కాకుండా పెద్దలు కూడా పబ్జీ గేమ్ ఆడుతూ గంటల పాటు ఫోన్లకే అతుక్కుపోతున్నారు. ఈ గేమ్ యువత మానసిక పరిస్థితిపై ప్రభావం చూపుతోంది. అంతేగాకుండా ఇస్లాంను కించపరిచేలా ఈ గేమ్ వుందని ముస్లిం సమాఖ్య వ్యతిరేకించింది. 
 
ఈ ఫిర్యాదులో భారత్‌లో ఇతర దేశాల కంటే అధిక సంఖ్యలో యువత వున్నారని.. అలాంటి వారిని ఇలాంటి గేమ్‌లు పాడు చేస్తున్నట్లు సమాఖ్య వెల్లడించింది. అంతేగాకుండా.. ఆన్‌లైన్ గేమ్‌ల ద్వారా భారత్ అభివృద్ధి పథంలో ముందుకు దూసుకెళ్లడాన్ని కళ్లెం వేస్తున్నట్లుందని.. యువతను తప్పదోవ పట్టించేందుకే ఇలాంటి ఆన్‌లైన్ గేమ్‌లను భారత్‌లోకి విదేశీ శక్తులు ప్రవేశపెడుతున్నాయని ముస్లిం లీగ్ సమాఖ్య తప్పుబట్టింది. ముఖ్యంగా పబ్జీ గేమ్‌లో ఇస్లాంల పవిత్ర స్థలాన్ని కించపరుస్తున్నట్లు వుందని ఆ సమాఖ్య వెల్లడించింది. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments