చైనాలో షియోమీ సంస్థ ''రెడ్ మీ నోట్ 7''ను విడుదల చేసింది. ఈ ఫోన్ 48/5 మెగాపిక్సల్ డ్యూయల్ బ్యాక్ కెమెరాలతో పాటు.. ఇందులో భారీ 4000 ఎంఏహెచ్ సామర్థ్యాన్ని కలిగివుంటుంది. 3జీబీ.. 4జీబీ ర్యామ్తో పాటు 6జీబీ వేరియంట్ కూడా మార్కెట్లో లభించనుంది.
ట్విలైట్ గోల్డ్, ఫాంటాసి బ్లూ, బ్రైట్ బ్లాక్ రంగుల్లో ఈ మార్కెట్లో లభ్యమవుతుంది. 3 జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఫోన్ ధర సుమారు రూ.10,300, 4 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఫోన్ ధర సుమారు రూ.12,400గా ఉంది.