Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫ్రెషర్లకు తేరుకోలేని షాకిచ్చిన విప్రో... ప్యాకేజీల్లో భారీగా కోత

Webdunia
మంగళవారం, 21 ఫిబ్రవరి 2023 (08:39 IST)
టెక్ దిగ్గజ కంపెనీల్లో ఒకటైన విప్రో తమ సంస్థలో కొత్తగా చేరిన వారికి తేరుకోలేని విధంగా షాకిచ్చింది. ఈ సంస్థలో పని చేసేందుకు ఎంపికైనపుడు ఇచ్చిన ప్యాకేజీ ఆఫర్‌లో భారీగా కోత విధించింది. శిక్షణ పూర్తి చేసిన తర్వాత సగానికి సగం ప్యాకేజీని తగ్గించేసింది. పైగా, ఈ సగం ప్యాకేజీకి అంగీకరిస్తేనే విధుల్లో చేరాలంటూ ఈమెయిల్స్ పంపించింది. 
 
గత 2022-23 వెలాసిటీ పట్టభద్రుల విభాగంలో శిక్షణ పూర్తి చేసుకున్న వారికి తొలుత 6.5 లక్షల వేతన ప్యాకేజీని విప్రో ఆఫర్ చేసింది. శిక్షణ పూర్తి చేసుకున్న వారిని వచ్చే నెల నుంచి విధుల్లోకి తీసుకునే ప్రక్రియను ప్రారంభించింది. అయితే, గతంలో ప్రకటించినట్టుగా రూ.6.5 లక్షల ప్యాకేజీకాకుండా రూ.3.5 లక్షల ప్యాకేజీ మాత్రమే ఇస్తామంటూ శిక్షణ పూర్తి చేసుకున్న సదరు ఉద్యోగులకు పంపించింది. పైగా, ఈ సగం ప్యాకేజీకి అంగీకరిస్తే తక్షణం ఉద్యోగాల్లో చేరవచ్చని తెలిపింది. 
 
ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో తమ వ్యాపార అవసరాలకు తగినట్టుగా నియామకాల్లో సర్దుబాటు చేస్తున్నట్టు ఆ మెయిల్‌లో విప్రో తెలిపింది. ఈ ఆఫర్‌కు అంగీకరించి వెంటనే విధుల్లో చేరాలని దీనిక ఒకే అంటే గత ఆఫర్ రద్దు అవుతుందని తెలిపింది. మరోవైపు, వెలాసిటీ పట్టభద్రుల విభాగంలో ఎంపికచేసిన వారిలో శిక్షణ సరిగా లేదని భావించిన 425 మంది శిక్షణా కాలంలోనే ఇంటికి పంపించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

క్రంచిరోల్, సోనీ పిక్చర్స్ డీమన్ స్లేయర్: కిమెట్సు నో యైబా.. తెలుగులో రాబోతోంది

Suhas: హే భగవాన్! నాకు హిట్ వచ్చేలా చేయ్ : సుహాస్

ఒత్తిడిలో ఉంటే మద్యం సేవిస్తా : పవన్ కళ్యాణ్ హీరోయిన్

ప్రపంచ వేదికపై మూడు రంగులు జెండా సంతోషాన్ని కలిగిస్తోంది : విజయ్ దేవరకొండ, రష్మిక

Nidhi: ప్రభాస్ రాజా సాబ్ తో పాటు మరో హారర్ థ్రిల్లర్ చిత్రంలో నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments