Webdunia - Bharat's app for daily news and videos

Install App

టర్కీలో మళ్లీ భూకంపం - గత రాత్రి 6.4 తీవ్రతతో ప్రకంపనలు

Webdunia
మంగళవారం, 21 ఫిబ్రవరి 2023 (08:30 IST)
ఇటీవల టర్కీ, సిరియా దేశాల్లో సంభవించిన భూకంపాల ధాటికి ఆ రెండు దేశాలు శ్మశానవాటికలను తలపిస్తున్నాయి. దాదాపు 46 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. టర్కీలోనే భారీ ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. ఈ భూకపం మిగిల్చిన గాయం నుంచి టర్కీ వాసులు ఇంకా కోలుకోలేదు. ఈ పరిస్థితుల్లో గత రాత్రి మరోమారు టర్కీలో భూమి కంపించింది. ఇది భూకంప లేఖినిపై 6.4గా నమోదైంది. అదేసమయంలో భూకంప ప్రభావిత ప్రాంతాల్లో అంటు వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నట్టు నిపుణులు హెచ్చరిస్తున్నారు. 
 
గత రాత్రి పొద్దుపోయిన తర్వాత ఈ భూకంపం సంభవించింది. దేశ దక్షిణ ప్రాంతమైన హటే ప్రానిన్స్‌లో 6.4 తీవ్రతతో భూమి కంపించింది. ఈ భూకంపం కారణంగా ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, 200 మందికిపైగా గాయపడ్డారు. గత భూకంపం కారణంగా బీటలు వారిన భవనాలు ఇంకా కూలిపోతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. 
 
కాగా, రెండు వారాల క్రితం ఈ నెల 6వ తేదీన తెల్లవారుజామున టర్కీలోని దక్షిణ కహ్రామన్మారస్ ప్రావిన్స్‌‍తో పాటు సిరియాలో సంభవించిన భారీ భూకంపం తర్వాత మరో 40 సార్లు భూమి కంపించిందింది. ఈ కారణంగా వేలాది భవనాలు నేలమట్టమయ్యాయి. పట్టణాలు శ్మశానవాటికలను తలపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మరోమారు భూమి కంపించడంతో టర్కీ వాసులు బెంబేలెత్తిపోతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

Comedian Ali: కమెడియన్ అలీ కూడా బెట్టింగ్ యాప్‌‌లో చిక్కుకున్నారా?

Uday Raj: 1990 నాటి టీనేజ్ లవ్ స్టోరీతో మధురం చిత్రం

Aamani : డొక్కా సీతమ్మ తో ఆమని కి అవార్డు రావాలి: మురళీ మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments