ఇకపై వాట్సాప్ స్టేటస్‌లో ప్రకటనలు.. అంతా డబ్బు కోసమే..

Webdunia
గురువారం, 1 నవంబరు 2018 (16:31 IST)
స్టేటస్‌లో ప్రకటనలకు అనుమతించేలా.. కొత్త ప్లాన్‌కు వాట్సాప్ సంస్థ సిద్ధమవుతోంది. ప్రపంచ వ్యాప్తంగా వాట్సాప్ యూజర్ల సంఖ్య 1.5 బిలియన్లకు చేరుకుంది. అలాగే భారత్‌లో మాత్రం 250 మిలియన్ వాట్సాప్ వినియోగదారులున్నారు. అంతేగాకుండా ఫేస్‌బుక్‌ చేతిలోకి వాట్సాప్ కూడా చేరాక పలు మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇందులో భాగంగా వాట్సాప్‌ సంస్థకు ఆదాయం చేకూర్చే దిశగా ఫేస్‌బుక్ చర్యలు చేపట్టింది. 
 
ఈ క్రమంలో వాట్సాప్ స్టేటస్‌లో ప్రకటనలు ఇచ్చేలా ఆ సంస్థ యోచిస్తోంది. దీని ప్రకారం ఇకపై వాట్సాప్ స్టేటస్‌లలో అడ్వర్టైజ్‌మెంట్లను వుంచనుంది. ఇలా వాట్సాప్ స్టేటస్‌లో వుంచే ప్రకటనలకు మంచి క్రేజ్ లభించే అవకాశం వుండటంతో.. సదరు వ్యాపార సంస్థలకు మంచి ఆదాయం వచ్చే ఛాన్సుందని వాట్సాప్ తెలిపింది.
 
ఈ మేరకు వాట్సాప్ సంస్థ అధికారి డేనియల్స్ కూడా వాట్సాప్ స్టేటస్‌లో ప్రకటనల అమలుకు సన్నద్ధంగా వున్నట్లు ధ్రువీకరించారు. త్వరలో ఈ ప్లాన్ అమల్లోకి రానుందని చెప్పారు. ఈ ప్లాన్ ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందనే నిర్ధిష్ట సమయాన్ని వాట్సాప్ పేర్కొనలేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా'లో వేశ్య పాత్ర చేయడానికి కారణం ఇదే : నటి బిందు మాధవి

Zee 5: ది గ్రేట్‌ ప్రీ వెడ్డింగ్ షో స్ట్రీమింగ్‌ జీ 5 లో రాబోతోంది

Raju Weds Rambai Review: నిఖార్సయిన ప్రేమకథగా రాజు వెడ్స్ రాంబాయి రివ్యూ

12A Railway Colony Review,: అల్లరి నరేష్ కు 12ఏ రైల్వే కాలనీ గట్టెక్కించేలా? 12ఏ రైల్వే కాలనీ రివ్యూ

Premante Review: గాడి తప్పిన ప్రియదర్శి, ఆనంది ల ప్రేమ.. ప్రేమంటే రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం