జియో బేసిక్ ఫోన్ కస్టమర్లకు గుడ్ న్యూస్.. త్వరలోనే వాట్సాప్ సదుపాయం

ఉచిత డేటా పేరిట దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన రిలయన్స్.. 4జీ బేసిక్ ఫోన్‌ను యూజర్లకు అందుబాటులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఫోనులో వాట్సాప్ సదుపాయం లేదు. త్వరలోనే 4జీ బేసిక్ ఫోన్‌లో వాట్సాప్ యాప్

Webdunia
గురువారం, 22 మార్చి 2018 (15:29 IST)
ఉచిత డేటా పేరిట దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన రిలయన్స్.. 4జీ బేసిక్ ఫోన్‌ను యూజర్లకు అందుబాటులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఫోనులో వాట్సాప్ సదుపాయం లేదు. త్వరలోనే 4జీ బేసిక్ ఫోన్‌లో వాట్సాప్ యాప్ సదుపాయం తీసుకురానున్నట్లు సమాచారం. వాట్సాప్ యాప్‌ను బేసిక్‌ ఫోనులో తీసుకొచ్చేందుకు ఇప్పటికే జియా వాట్సాప్‌తో చర్చలు జరుపుతుందని తెలిసింది. 
 
వాట్సాప్ కేఏఐఓఎస్‌కు సపోర్ట్ చేసే యాప్‌ను రూపొందించే పనిలో ఉన్నట్టు ఆ సంస్థ వ్యవహరాలను విశ్లేషించే వాబీటా ఇన్ఫో పేర్కొంది. వాట్సాప్ కొత్త వెర్షన్‌ను విడుదల చేసే ముందు పరీక్షిస్తుందనే విషయం తెలిసిందే. 
 
ప్రస్తుతం రిలయన్స్ జియో ఫోన్లను సపోర్ట్ చేసే యాప్ కూడా బీటా దశలో ఉందని వాబీటా ఇన్ఫో తెలిపింది. దీనివల్ల వాట్సాప్ కూడా ప్రయోజనమేనని.. జియో బేసిక్ ఫోన్‌లో వాట్సాప్ కలిస్తే తమ సంస్థకు యూజర్ల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని వాబీటా ఓ ప్రకటనలో వెల్లడించింది. 
 
ఇదిలా ఉంటే.. శామ్‌సంగ్ సంస్థ రిలయెన్స్ జియోతో జతకట్టింది. శామ్‌‌సంగ్ ఇటీవల విడుదల చేసిన గెలాక్సీ ఎస్9, గెలాక్సీ ఎస్9 ప్లస్ ఫోన్ల అమ్మకం కోసం రిలయన్స్ జియోతో ఒప్పందం చేసుకుంది. ఈ డీల్ ద్వారా గెలాక్సీ ఎస్9, గెలాక్సీ ఎస్9 ప్లస్ స్మార్ట్ ఫోన్లు రిలయన్స్ డిజిటల్‌, జియో వెబ్‌సైట్లలో అందుబాటులోకి వచ్చాయి. ఈ వెబ్‌సైట్ ద్వారా శామ్‌సంగ్ ఫోన్లు క్యాష్ బ్యాక్ ఆఫర్లతో లభిస్తాయని జియో వెల్లడించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

సినిమా పెట్టుబడి రూ.50 లక్షలు.. 54రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు

టాలీవుడ్ ప్రముఖులతో సమావేశమైన కొరియన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ యూ ఇన్-సిక్

సినిమాకు శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా : ఎన్ హెచ్ ప్రసాద్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments