Webdunia - Bharat's app for daily news and videos

Install App

3 నుంచి వొడాఫోన్ చార్జీల బాదుడు... 43 శాతం పెంపు

Webdunia
ఆదివారం, 1 డిశెంబరు 2019 (17:29 IST)
దేశంలో ఉన్న ప్రైవేట్ టెలికాం కంపెనీల్లో ఒకటైన వొడాఫోన్ గతంలో ప్రకటించినట్టుగానే మొబైల్ చార్జీలను భారీగా పెంచనుంది. ఈ పెంపు ఏకంగా 43 శాతం మేరకు ఉండనుంది. పైగా, పెంచిన ధరలు ఈ నెల 3వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. 
 
ఇటీవల వొడాఫోన్ కంపెనీ ఓ ప్రకటన విడుదల చేసింది. ఇందులో వొడాఫోన్ ఇండియా లిమిటెడ్ ప్రీపెయిడ్ కొత్త టారిఫ్‌లు, ప్లాన్లు ప్రకటిస్తోంది. అన్నీ ప్లాన్లు దేశవ్యాప్తంగా ఈ నెల మూడో తేదీ నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది. ఆ ప్రకారంగా ఇపుడు కొత్త టారిఫ్‌లను ప్రకటించింది. 
 
ఈ టారిఫ్‌ల ప్రకారం కొత్త ధరల్లో 43 శాతం మేరకు పెరుగుదల కనిపించింది. అన్‌లిమిటెడ్ విభాగంలో 2, 28, 84, 365 రోజుల కింద సరికొత్త ప్లాన్లను తీసుకొచ్చింది. గతంలో ఉన్న ప్లాన్లను పోల్చినపుడు కొత్త ప్లాన్ల ధరల్లో 41.2 శాతం మేరకు పెరుగుదల కనిపిస్తోంది. ప్రస్తుతం ఉన్న అన్‌లిమిటెడ్ ప్లాన్ల స్థానంలో డిసెంబరు మూడో తేదీ నుంచి కొత్త ప్లాన్లు అందుబాటులోకి రానున్నాయని కంపెనీ తెలిపింది. 
 
కాగా, రోజుకు 1.5 జీబీ డేటా చొప్పున 84 రోజుల కాలపరిమితితో ఉన్న ప్లాన్ ధర ప్రస్తుతం రూ.458గా వుండగా, దీన్ని రూ.599కి పెంచింది. అంటే ఈ ప్లాన్ ధరను 31 శాతం మేరకు పెంచారు. అలాగే, రూ.199 ప్లాన్ ధరను రూ.249, 365 రోజుల ప్లాన్ ధరను రూ.1699 నుంచి రూ.2399కి పెంచారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram Charan: నైట్ పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్ కేక్ కట్ చేశాడు

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments