Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లి ప్రస్తావనతో ఇంటికొచ్చి అత్యాచారం చేసిన మాట్రిమోనిలో పరిచయమైన వ్యక్తి

Webdunia
ఆదివారం, 1 డిశెంబరు 2019 (17:12 IST)
హైదరాబాద్ నగరం ఇపుడు పశువైద్యురాలు ప్రియాంకా రెడ్డి హత్య కేసు ఘటనపై చర్చసాగుతోంది. ఈ ఘటన మరువకముందే ఇపుడు మరో దారుణం జరిగింది. పెళ్లి ప్రస్తావన తెచ్చిన ఓ వ్యక్తి.. ఇంట్లో ఒంటరిగా ఉన్న యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ వ్యక్తి కూడా మాట్రిమోని ద్వారా పరిచయమై ఈ దారుణానికి పాల్పడ్డాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, హైదరాబాద్, నిజాంపేటలో ఓ అపార్ట్‌మెంట్‌లో ఓ యువతి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తూ తన సోదరితో కలిసి అద్దె ఇంట్లో నివశిస్తోంది. వారికి 20 రోజుల క్రితం మాట్రిమోని ద్వారా జయచంద్‌ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. వారం రోజుల క్రితం సుజనా ఫోరమ్‌ మాల్‌ వద్ద బాధితురాలి సోదరితో తమ పెళ్లి విషయమై కలిసి మాట్లాడాడు. 
 
ఈ సందర్భంగా పెళ్లి ప్రస్తావన కూడా తీసుకొచ్చాడు. ఈ విషయంపై కుటుంబ సభ్యులతో మాట్లాడాలని బాధితురాలి సోదరి చెప్పారు. ఈ పరిచయాన్ని అవకాశంగా తీసుకున్న జయచంద్‌.. శనివారం మధ్యాహ్నం ఇంట్లో ఒంటరిగా ఉన్న యువతి వద్దకు వచ్చి అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. అనంతరం గదిలో ఉన్న నగలతో పరారయ్యాడు. 
 
సాయంత్రం బాధితురాలు సోదరి ఇంటికి రాగా.. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను చూసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హరిహర వీరమల్లు టాక్‌పై హైపర్ ఆది ఏమన్నారు?

Devarakonda, Sandeep reddy : కింగ్డమ్ బాయ్స్ ప్రచారానికి సిద్ధమయ్యారు

పవన్ కళ్యాణ్ వీరమల్లుకు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబునాయుడు

కమల్ హాసన్, రజనీకాంత్‌లపై లోకేష్ కనగరాజ్ దమ్మున్న ప్రకటన చేశాడు

మునుపెన్నడూ లేని విధంగా స్క్రీన్‌లపై కింగ్‌డమ్ విడుదల కాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments