Webdunia - Bharat's app for daily news and videos

Install App

డీటీహెచ్ బిల్లులు చూసి బెంబేలెత్తిపోతున్న కస్టమర్లు.. రంగంలోకి ట్రాయ్

Webdunia
సోమవారం, 19 ఆగస్టు 2019 (21:34 IST)
నాణ్యమైన కేబుల్ టీవీ, డీటీహెచ్ ప్రసారాల కోసం కేంద్ర ప్రభుత్వం సరికొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చింది. అయితే, ఈ విధానం వద్దనే వద్దని ఆదిలోనే కేబుల్ టీవీ ప్రసారాల డిస్ట్రిబ్యూటర్లు గగ్గోలు పెట్టారు. కానీ, కేంద్రం ఏమాత్రం పట్టించుకోలేదు. కానీ, ఒకటి, రెండు నెలలు గడిచిన తర్వాతగానీ కేంద్రం తీసుకొచ్చిన విధానం వల్ల వినియోగదారులపై విపరీతమైన భారం పడిందన్న విషయం బోధపడలేదు. 
 
అనేక ప్రైవేట్ చానళ్ల రుసుములు విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో నెలవారి బిల్లులు తడిసి మోపెడయ్యాయి. వీటిని చూసిన కస్టమర్లు బెంబేలెత్తిపోతున్నారు. డీటీహెచ్ ప్రసారాల ప్యాకేజీ ధరలు కూడా పెరిగిపోయాయి. దీంతో వినియోగదారులు గగ్గోలు పెట్టసాగారు. 
 
ఈ నేపథ్యంలో దేశంలోని కేబుల్, డీటీహెచ్ వినియోగదారులకు ఊరట కలిగించేలా ట్రాయ్ (టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (టి.ఆర్.ఏ.ఐ) రంగంలోకి దిగింది. టెలికాం కంపెనీలు చానెల్ ధరలు, బొకే చార్జీలను మరోసారి సమీక్షించాలంటూ ఆదేశాలు జారీచేసింది. సెప్టెంబరు 16వ తేదీలోగా ధరల తగ్గింపుపై అభిప్రాయాలు, ప్రతిపాదనలు వెల్లడించాలని కోరింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

కింగ్‌డమ్ విషయంలో పెద్ద ఛాలెంజ్ పరీక్షలో పాస్ అయ్యాము: సూర్యదేవర నాగ వంశీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments