జియో దూకుడు... ప్రైవేట్ టెలికాం కంపెనీల బేజారు

Webdunia
సోమవారం, 19 ఆగస్టు 2019 (21:24 IST)
రిలయన్స్ జియో దూకుడు కొనసాగుతోంది. దీంతో ఇతర ప్రైవేట్ టెలికాం కంపెనీలు బేజారైపోతున్నాయి. దేశంలో రిలయన్స్ జియో సేవలు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇతర కంపెనీలు తేరుకోలేని విధంగా దెబ్బతిన్న విషయం తెల్సిందే. టెలికాం రంగంలో జియో సృష్టించిన సునామీ ఇప్పటికీ కొనసాగుతోంది. 
 
ఫలితంగా జియో ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు ప్రత్యర్థులపై పైచేయి సాధిస్తూనేవుంది. ఫలితంగా జూన్ నెలలో ఏకంగా 8.26 మిలియన్ మంది కొత్త మొబైల్ ఫోన్ యూజర్లను చేర్చుకుంది. దీంతో జియో సబ్‌స్క్రైబర్ల బేస్ 331.2 మిలియన్లకు చేరుకుంది. 
 
అదే సమయంలో వొడాఫోన్ ఐడియా 4.1 మిలియన్ల మంది వినియోగదారులను కోల్పోయింది. దేశంలోని మూడో అతిపెద్ద టెలికం సంస్థ భారతీ ఎయిర్‌టెల్ 29,883 మంది ఖాతాదారులను కోల్పోయింది. దీంతో జూన్‌ చివరి నాటికి ఆ సంస్థ ఖాతాదారుల సంఖ్య 320.35 మిలియన్లుగా ఉంది.
 
ఇకపోతే, జూన్ మాసాంతానికి వొడాఫోడ్ ఐడియాలు సంస్థలు కలిపి తమ ఖాతాదారుల సంఖ్యను 320 మిలియన్లుగా చూపించగా... టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ మాత్రం 383.41 మిలియన్లుగా చెబుతోంది. అలాగే, భారతీ ఎయిర్‌టెల్ జూన్‌ మాసాంతానికి తమ ఖాతాదారుల సంఖ్యను 281.13 మిలియన్లుగా పేర్కొనగా, ట్రాయ్ మాత్రం 320.35 మిలియన్లుగా చూపించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా'లో వేశ్య పాత్ర చేయడానికి కారణం ఇదే : నటి బిందు మాధవి

Zee 5: ది గ్రేట్‌ ప్రీ వెడ్డింగ్ షో స్ట్రీమింగ్‌ జీ 5 లో రాబోతోంది

Raju Weds Rambai Review: నిఖార్సయిన ప్రేమకథగా రాజు వెడ్స్ రాంబాయి రివ్యూ

12A Railway Colony Review,: అల్లరి నరేష్ కు 12ఏ రైల్వే కాలనీ గట్టెక్కించేలా? 12ఏ రైల్వే కాలనీ రివ్యూ

Premante Review: గాడి తప్పిన ప్రియదర్శి, ఆనంది ల ప్రేమ.. ప్రేమంటే రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments