Webdunia - Bharat's app for daily news and videos

Install App

జియో దూకుడు... ప్రైవేట్ టెలికాం కంపెనీల బేజారు

Webdunia
సోమవారం, 19 ఆగస్టు 2019 (21:24 IST)
రిలయన్స్ జియో దూకుడు కొనసాగుతోంది. దీంతో ఇతర ప్రైవేట్ టెలికాం కంపెనీలు బేజారైపోతున్నాయి. దేశంలో రిలయన్స్ జియో సేవలు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇతర కంపెనీలు తేరుకోలేని విధంగా దెబ్బతిన్న విషయం తెల్సిందే. టెలికాం రంగంలో జియో సృష్టించిన సునామీ ఇప్పటికీ కొనసాగుతోంది. 
 
ఫలితంగా జియో ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు ప్రత్యర్థులపై పైచేయి సాధిస్తూనేవుంది. ఫలితంగా జూన్ నెలలో ఏకంగా 8.26 మిలియన్ మంది కొత్త మొబైల్ ఫోన్ యూజర్లను చేర్చుకుంది. దీంతో జియో సబ్‌స్క్రైబర్ల బేస్ 331.2 మిలియన్లకు చేరుకుంది. 
 
అదే సమయంలో వొడాఫోన్ ఐడియా 4.1 మిలియన్ల మంది వినియోగదారులను కోల్పోయింది. దేశంలోని మూడో అతిపెద్ద టెలికం సంస్థ భారతీ ఎయిర్‌టెల్ 29,883 మంది ఖాతాదారులను కోల్పోయింది. దీంతో జూన్‌ చివరి నాటికి ఆ సంస్థ ఖాతాదారుల సంఖ్య 320.35 మిలియన్లుగా ఉంది.
 
ఇకపోతే, జూన్ మాసాంతానికి వొడాఫోడ్ ఐడియాలు సంస్థలు కలిపి తమ ఖాతాదారుల సంఖ్యను 320 మిలియన్లుగా చూపించగా... టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ మాత్రం 383.41 మిలియన్లుగా చెబుతోంది. అలాగే, భారతీ ఎయిర్‌టెల్ జూన్‌ మాసాంతానికి తమ ఖాతాదారుల సంఖ్యను 281.13 మిలియన్లుగా పేర్కొనగా, ట్రాయ్ మాత్రం 320.35 మిలియన్లుగా చూపించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రోడ్డు ప్రమాదంలో 'దసరా' మూవీ విలన్ తండ్రి దుర్మరణం

రూ.21 కోట్లు వడ్డీతో చెల్లించండి.. విశాల్‌కు హైకోర్టు ఆదేశం

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments