Webdunia - Bharat's app for daily news and videos

Install App

జియో దూకుడు... ప్రైవేట్ టెలికాం కంపెనీల బేజారు

Webdunia
సోమవారం, 19 ఆగస్టు 2019 (21:24 IST)
రిలయన్స్ జియో దూకుడు కొనసాగుతోంది. దీంతో ఇతర ప్రైవేట్ టెలికాం కంపెనీలు బేజారైపోతున్నాయి. దేశంలో రిలయన్స్ జియో సేవలు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇతర కంపెనీలు తేరుకోలేని విధంగా దెబ్బతిన్న విషయం తెల్సిందే. టెలికాం రంగంలో జియో సృష్టించిన సునామీ ఇప్పటికీ కొనసాగుతోంది. 
 
ఫలితంగా జియో ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు ప్రత్యర్థులపై పైచేయి సాధిస్తూనేవుంది. ఫలితంగా జూన్ నెలలో ఏకంగా 8.26 మిలియన్ మంది కొత్త మొబైల్ ఫోన్ యూజర్లను చేర్చుకుంది. దీంతో జియో సబ్‌స్క్రైబర్ల బేస్ 331.2 మిలియన్లకు చేరుకుంది. 
 
అదే సమయంలో వొడాఫోన్ ఐడియా 4.1 మిలియన్ల మంది వినియోగదారులను కోల్పోయింది. దేశంలోని మూడో అతిపెద్ద టెలికం సంస్థ భారతీ ఎయిర్‌టెల్ 29,883 మంది ఖాతాదారులను కోల్పోయింది. దీంతో జూన్‌ చివరి నాటికి ఆ సంస్థ ఖాతాదారుల సంఖ్య 320.35 మిలియన్లుగా ఉంది.
 
ఇకపోతే, జూన్ మాసాంతానికి వొడాఫోడ్ ఐడియాలు సంస్థలు కలిపి తమ ఖాతాదారుల సంఖ్యను 320 మిలియన్లుగా చూపించగా... టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ మాత్రం 383.41 మిలియన్లుగా చెబుతోంది. అలాగే, భారతీ ఎయిర్‌టెల్ జూన్‌ మాసాంతానికి తమ ఖాతాదారుల సంఖ్యను 281.13 మిలియన్లుగా పేర్కొనగా, ట్రాయ్ మాత్రం 320.35 మిలియన్లుగా చూపించింది. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments