Webdunia - Bharat's app for daily news and videos

Install App

జియో దూకుడు... ప్రైవేట్ టెలికాం కంపెనీల బేజారు

Webdunia
సోమవారం, 19 ఆగస్టు 2019 (21:24 IST)
రిలయన్స్ జియో దూకుడు కొనసాగుతోంది. దీంతో ఇతర ప్రైవేట్ టెలికాం కంపెనీలు బేజారైపోతున్నాయి. దేశంలో రిలయన్స్ జియో సేవలు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇతర కంపెనీలు తేరుకోలేని విధంగా దెబ్బతిన్న విషయం తెల్సిందే. టెలికాం రంగంలో జియో సృష్టించిన సునామీ ఇప్పటికీ కొనసాగుతోంది. 
 
ఫలితంగా జియో ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు ప్రత్యర్థులపై పైచేయి సాధిస్తూనేవుంది. ఫలితంగా జూన్ నెలలో ఏకంగా 8.26 మిలియన్ మంది కొత్త మొబైల్ ఫోన్ యూజర్లను చేర్చుకుంది. దీంతో జియో సబ్‌స్క్రైబర్ల బేస్ 331.2 మిలియన్లకు చేరుకుంది. 
 
అదే సమయంలో వొడాఫోన్ ఐడియా 4.1 మిలియన్ల మంది వినియోగదారులను కోల్పోయింది. దేశంలోని మూడో అతిపెద్ద టెలికం సంస్థ భారతీ ఎయిర్‌టెల్ 29,883 మంది ఖాతాదారులను కోల్పోయింది. దీంతో జూన్‌ చివరి నాటికి ఆ సంస్థ ఖాతాదారుల సంఖ్య 320.35 మిలియన్లుగా ఉంది.
 
ఇకపోతే, జూన్ మాసాంతానికి వొడాఫోడ్ ఐడియాలు సంస్థలు కలిపి తమ ఖాతాదారుల సంఖ్యను 320 మిలియన్లుగా చూపించగా... టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ మాత్రం 383.41 మిలియన్లుగా చెబుతోంది. అలాగే, భారతీ ఎయిర్‌టెల్ జూన్‌ మాసాంతానికి తమ ఖాతాదారుల సంఖ్యను 281.13 మిలియన్లుగా పేర్కొనగా, ట్రాయ్ మాత్రం 320.35 మిలియన్లుగా చూపించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

తర్వాతి కథనం
Show comments