Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్మార్ట్ ఫోన్ యూజర్లకు శుభవార్త.. ఐసీయూ తగ్గనుందట.. అంతా జియో ఎఫెక్ట్..

టెలికాం రంగంలో పెను సంచలనం సృష్టించిన జియో ఉచిత కాల్స్‌ అందించే క్రమంలో ఇంటర్‌కనెక్ట్‌ యూసేజ్‌ ఛార్జీలతో ఇబ్బందులు ఎదుర్కొంది. ఈ ఛార్జీలను పూర్తిగా తొలగించాలని రిలయన్స్‌ జియో కోరుతోంది. అయితే వీటిని మ

Webdunia
ఆదివారం, 13 ఆగస్టు 2017 (15:59 IST)
టెలికాం రంగంలో పెను సంచలనం సృష్టించిన జియో ఉచిత కాల్స్‌ అందించే క్రమంలో ఇంటర్‌కనెక్ట్‌ యూసేజ్‌ ఛార్జీలతో ఇబ్బందులు ఎదుర్కొంది. ఈ ఛార్జీలను పూర్తిగా తొలగించాలని రిలయన్స్‌ జియో కోరుతోంది. అయితే వీటిని మరింత పెంచాలని ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌, ఐడియావంటి మొబైల్‌ ఆపరేటర్లు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు ట్రాయ్ శుభవార్త చెప్పింది. 
 
ఈ క్రమంలో ఇంటర్‌కనెక్ట్‌ యూసేజ్‌ ఛార్జీల(ఐసీయూ)ను తగ్గించేందుకు ట్రాయ్‌ కసరత్తులు చేస్తున్నట్లు సమాచారం. దీంతో కాల్ ఛార్జీలు, డేటా ప్యాక్‌లు ధరలు దిగివస్తున్న క్రమంలో ఐసీయూను తగ్గించడం ద్వారా వినియోగదారులు పండగ చేసుకున్నట్లే. ఇప్పటివరకు వివిధ ఆపరేటర్లు కాల్స్‌ను కనెక్ట్‌ చేసేందుకు వసూలు చేస్తున్న ఐసీయూను ప్రస్తుతం నిమిషానికి 14 పైసల నుంచి 10 పైసలకు తగ్గించనున్నారు.
 
గత ఏడాది సెప్టెంబరులో రిలయన్స్ జియో రాకతో మొబైల్ టారిఫ్‌లు ప్రభావితమైన క్రమంలో ఐసీయూ వసూలు కీలకాంశంగా మారింది. అయితే ప్రస్తుతం దాన్ని తగ్గించడం ద్వారా వినియోగదారుల కష్టాలు తగ్గే అవకాశం ఉంది. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments