Webdunia - Bharat's app for daily news and videos

Install App

జియో కూడా షేక్ అవ్వాల్సిందే.. రూపాయికే వన్ జీబీ డేటా

Webdunia
శనివారం, 1 ఫిబ్రవరి 2020 (11:30 IST)
దేశీయ టెలికాం రంగంలోకి ఉచిత ఆఫర్లతో ప్రవేశించి ఇపుడు నంబర్ వన్ కంపెనీగా ఉన్న రిలయన్స్ జియో ఇపుడు షేక్ అవుతోంది. ప్రభుత్వ, ప్రైవేట్ టెలికాం కంపెనీలను షేక్ చేసిన రిలయన్స్ జియో.. ఇపుడు బెంగుళూరుకు చెందిన స్టార్టర్ కంపెనీ వైఫై డబ్బా దెబ్బకు బెంబేలెత్తిపోతోంది. మొబైల్‌ ఫోన్‌ వినియోగదారులకు కేవలం రూ.1 కే.. ఒక జీబీ డేటాను అందించనున్నట్టు సంచలన ప్రకటన చేసింది. 
 
ఈ విషయాన్ని వైఫై డబ్బా సీఈవో కంరం లక్ష్మణ్‌ వెల్లడించారు. అయితే, మొదట ప్రయోగాత్మకంగా బెంగళూరులో ఆ ప్లాన్ అందుబాటులో ఉండగా.. అక్కడ విజయవంతమైతే.. త్వరలోనే దేశవ్యాప్తంగా అమలు చేయనున్నట్టు వెల్లడించారు. 
 
మొబైల్‌ ఫోన్లలో ఓటీపీ ఎంటర్‌ చేయడంతో 'వైఫై డబ్బా'కు ఎవరైనా కనెక్ట్‌ అయ్యే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా.. టీ షాపులు, వ్యాపార కూడళ్లలో ప్రీపెయిడ్‌ కూపన్ల ద్వారా కూడా డేటా సేవలను పొందే అవకాశం కల్పిస్తున్నారు. ఇది జియోకు గట్టి పోటీనిచ్చే అవకాశం ఉందంటున్నారు.
 
నిజానికి వైఫై డబ్బా గత 2017 నుంచి డేటా సేవలు అందిస్తోంది. అంతకుముందు 20 రూపాయలకు 1 జీబీ డేటా లభించింది. ఓ నివేదిక ప్రకారం, ఇప్పుడు వైఫై దబ్బాలో ఒక రూపాయికి ఒక జీబీ డేటా అందుబాటులో ఉంది. ఆ సంస్థ నుంచి ఇప్పుడు మూడు ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. రూ.2కు 1 జీబీ డేటా, రూ.10కు 5 జీబీ డేటా, రూ.20కు 10 జీబీ డేటా ప్లాన్‌లు లభిస్తున్నాయి. ఈ అన్ని ప్లాన్లు చెల్లుబాటు సమయం 24 గంటలు ఉంటుంది. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments