Webdunia - Bharat's app for daily news and videos

Install App

లంచాలు ఇచ్చేందుకు రూ.188 కోట్ల నిధులు కేటాయింపు

Webdunia
బుధవారం, 28 సెప్టెంబరు 2022 (16:32 IST)
భారతదేశంలో తమ పనులు సక్రమంగా సాగే నిమిత్తం అధికారులకు లంచాలు ఇచ్చేందుకు ప్రముఖ టెక్ కంపెనీ ఒరాకిల్ ఏకంగా రూ.188 కోట్ల నిధులను కేటాయించింది. ఈ సంస్థ భారీగా అవకతవకలకు పాల్పడినట్టు అమెరికా సెక్యూరిటీస్ ఎక్చేంజ్ కమిషన్ (ఎస్ఈసీ) గుర్తించింది. భారత్, యూఏఈ, టుర్కీ దేశాల్లో అధికారులకు లంచాలు ఇచ్చేందుకు ప్రత్యేకంగా 3.30 లక్షల డాలర్లు (భారత కరెన్సీలో రూ.188 కోట్లు) కేటాయించినట్టు గుర్తించింది. ఇది విదేశీ అవినీతి కార్యకలాపాల చట్టం (ఎఫ్‌సీపీఏ) ఉల్లంఘనే అవుతుందని పేర్కొంది. 
 
ముఖ్యంగా ఒరాకిల్ ఇండియా విభాగం రైల్వేశాఖ ఆధ్వర్యంలోని ఓ రవాణా సంస్థకు భారీ రాయితీ ఇచ్చినట్టు ఎస్.ఈ.సి వెల్లడించింది. ఓ సాఫ్ట్‌వేర్ కాంపోనెంట్ విషయంలో తీవ్ర పోటీ ఉన్నందన ఒప్పందం చేజారకుండా ఉండేందుకు ఈ రాయితీ ఇవ్వాల్సి వస్తుందని సేల్ సిబ్బంది ఒరాకిల్ ఉన్నతాధికారులకు తెలియజేయగా, అందుకు వారు వెంటనే అనుమతి ఇచ్చినట్టు ఎస్ఈసీ విచారణలో వెల్లడైంది. 
 
అయితే, ఒరాకిల్‌పై ఎస్ఈసీ కన్నెర్ర చేయడం ఇది తొలిసారికాదు. పదేళ్ల కిందట కూడా ఒరాకిల్ ఇండియా విభాగంపై ఆరోపణలు రాగా, ఎస్ఈసీ రూ.16 కోట్ల జరిమానా వడ్డించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

Ananya: స్మాల్ స్కేల్ ఉమెన్ సెంట్రిక్ సినిమాలకు అడ్రెస్ గా మారిన అనన్య నాగళ్ళ

మారుతీ చిత్రం బ్యూటీ నుంచి కన్నమ్మ సాంగ్ విడుదల

Shambhala: ఆది సాయికుమార్ శంబాల నుంచి హనుమంతు పాత్రలో మధునందన్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments