Webdunia - Bharat's app for daily news and videos

Install App

టెలికాం సంస్థలకు సుప్రీం కోర్టులో ఊరట.. 1.6లక్షల కోట్ల బకాయిలను..?

Webdunia
మంగళవారం, 1 సెప్టెంబరు 2020 (15:46 IST)
సుప్రీం కోర్టులో టెలికాం సంస్థలకు ఊరట లభించింది. ప్రభుత్వానికి (DoT) చెల్లించాల్సి బకాయిలపై సర్వోన్నత న్యాయస్థానం సరికొత్త డెడ్‌లైన్ విధిస్తూ మంగళవారం తీర్పునిచ్చింది. పదేళ్లలో ఏజీఆర్ బకాయిలను చెల్లించాలని పలు షరతులతో సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వానికి సుమారు 1.6లక్షల కోట్ల బకాయిలను టెలికాం సంస్థలు చెల్లించాల్సి ఉంది. దీనిపై మంగళవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. 
 
వచ్చే ఏడాది 2021 మార్చి 31 పదిశాతం బకాయిలను చెల్లించాలని.. పదేళ్లల్లో (2031 నాటికి) ఏడీఆర్ బకాయిలన్నీంటిని చెల్లించాలని జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం తీర్పునిచ్చింది. అయితే బకాయిల చెల్లింపులపై టెలికాం ఎండీలు, సీఈవోలు నాలుగు వారాల్లో అఫిడవిట్‌ దాఖలు చేయాలని సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. 
 
ప్రస్తుత బ్యాంకు గ్యారంటీలు యథాతధంగా కొనసాగుతాయని, వడ్డీ చెల్లింపుల వివరాలు ప్రతి సంవత్సరం అందించాలని పేర్కొంది. ఇన్‌స్టాల్‌మెంట్లు, ఏజీఆర్  బకాయిలు చెల్లిచడంలో కంపెనీలు విఫలమైతే జరిమానా, వడ్డీతోపాటు కోర్టు ధిక్కరణ కేసు కూడా నమోదవుతుందని హెచ్చరించింది. అయితే.. సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పుతో భారతి ఎయిర్‌టెల్, ఐడీయా, వొడాఫోన్ వంటి సంస్థలకు పెద్ద ఉపశమనం లభించింది.

సంబంధిత వార్తలు

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

ప్రతిదీ మార్కెట్ చేయడంలో రాజమౌళి నెంబర్ ఒన్ -- స్పెషల్ స్టోరీ

పురాణ యుద్ధ ఎపిసోడ్‌ కు 8 కోట్లు వెచ్చిస్తున్న స్వయంభు నిర్మాత

సమయ స్ఫూర్తి, ఆకట్టుకునే మాటతీరుతో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న గీతా భగత్

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments