Webdunia - Bharat's app for daily news and videos

Install App

జియో సంచలనం.. సరికొత్త రికార్డు.. టెలికాం సంస్థలు బెంబేలు

Reliance Industries
Webdunia
గురువారం, 21 నవంబరు 2019 (13:22 IST)
దేశ వ్యాప్తంగా ఉచిత జియోతో సంచలనం సృష్టించిన రిలయన్స్ ఇండస్ట్రీస్ సరికొత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ప్రపంచంలోనే ఆరో అతి పెద్ద ఇంధన దిగ్గజంగా అవతరించింది. దాంతో ఎలైట్ క్లబ్‌లో చేరినట్లైంది. అటు ఆ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ.. ఇటు రిలయన్స్ సంస్థలు నంబర్ వన్ దిశగా ముందడుగు వేస్తోంది. ప్రపంచంలోనే మార్కెట్ క్యాపిటలైజేషన్‌లో బ్రిటీష్ మల్టీ నేషనల్ ఆయిల్ కంపెనీ బీపీని వెనక్కి నెట్టి రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆరవ స్థానంలో నిలిచింది. 
 
గత రెండు రోజుల్లోనే రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ స్టాక్స్ 6 శాతం పెరిగాయి. షేర్ విలువ తొలి సారి రూ.1500 మార్కు దాటింది. ప్రస్తుతం రూ.1534 వద్ద కొనసాగుతోంది. ఇక.. దీని మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.9.5 లక్షల కోట్లకు చేరింది. తర్వలోనే రూ.10 లక్షల కోట్ల మార్కెట్ విలువ దాటిన తొలి భారతీయ కంపెనీగా రికార్డు నెలకొల్పనుంది. 
 
వొడాఫోన్ ఐడియా, భారతి ఎయిర్‌టెల్ డిసెంబరు 1 నుంచి టారిఫ్ ఛార్జీలు పెంచుతామని ప్రకటించిన తర్వాత రిలయన్స్ మార్కెట్ విలువ మరింత పెరగడం గమనార్హం. దానివల్ల జియో మరింత మంది యూజర్లను ఆకర్షించే అవకాశం ఉందని టాక్ వస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments