Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

'గద్దలకొండ గణేష్' తల్లిగా రమ్యకృష్ణ

'గద్దలకొండ గణేష్' తల్లిగా రమ్యకృష్ణ
, బుధవారం, 13 నవంబరు 2019 (14:50 IST)
మెగా పవర్ స్టార్ వరుణ్ తేజ్ ఇటీవల 'గద్దలకొండ గణేష్' చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రం సూపర్ హిట్ కావడంతో మంచి జోష్‌లో ఉన్నాడు. ఈ చిత్రం తర్వాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సరికొత్త చిత్రంలో నటిస్తున్నాడు. 
 
ఈ చిత్రం కోసం సీనియర్ నటి రమ్యకృష్ణతో సంప్రదింపులు జరుపుతున్నట్టుగా ఒక వార్త రెండు రోజులుగా షికారు చేస్తోంది. అయితే సురేందర్ రెడ్డి సినిమా కోసం ఆమెను అడుగుతున్నారా? లేదంటే కిరణ్ కొర్రపాటి సినిమా కోసం అడుగుతున్నారా? అనే సందేహమే ఫిల్మ్ నగర్లో వినిపించింది. రమ్యకృష్ణను సంప్రదించింది కిరణ్ కొర్రపాటి సినిమా కోసమేననేది తాజా సమాచారం.
 
ఈ సినిమాలో వరుణ్ తేజ్ తల్లిగా రమ్యకృష్ణ కనిపించనుందని అంటున్నారు. ఆ పాత్రకి చాలా ప్రాధాన్యత ఉండటం వలన ఆమెను తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఆమె భర్త పాత్రకిగాను మాధవన్‌ను అడుగుతున్నారట. దాదాపు ఆ పాత్రకి ఆయన ఖరారైపోవచ్చని అంటున్నారు. ఈ మధ్య వచ్చిన 'సవ్యసాచి'లో నెగెటివ్ షేడ్స్ కలిగిన పాత్రను చేసిన మాధవన్, త్వరలో 'నిశ్శబ్దం' చిత్రం ద్వారా ప్రేక్షకులను పలకరించనున్న విషయం తెల్సిందే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బెంజ్ కారు టైరు బ్లాస్ట్ కావడం వల్లే ప్రమాదం (video)