జీయో నెట్‌వర్క్‌లో సాంకేతిక లోపం.. సేవల్లో అంతరాయం..!

Webdunia
బుధవారం, 6 అక్టోబరు 2021 (13:42 IST)
దేశంలో ప్రైవేట్ మొబైల్ దిగ్గజ ఆపరేటింగ్ సంస్థగా ఉన్న జియో సేవలకు బుధవారం అంతరాయం ఏర్పడింది. ఈ కంపెనీ నెట్‌వర్క్‌లో సాంకేతిక లోపం తలెత్తడం వల్లే ఈ సేవలకు స్వల్ప అంతరాయం ఏర్పడినట్టు సమాచారం. ఈ విషయాన్ని ‘డౌన్‌డిటెక్టర్‌’ వెల్లడించింది. 
 
నెట్‌వర్క్ సమస్య గురించి వినియోగదారుల నుంచి ఫిర్యాదులు పెరిగినట్లు తెలిపింది. అయితే దీని ప్రభావం ఏమేరకు ఉందనేది తెలియాల్సి ఉందని పేర్కొంది. అదేసమయంలో జియో నెట్‌వర్క్‌లో అంతరాయంపై వినియోగదారులు ట్విటర్‌లో ఫిర్యాదు చేశారు. 
 
భారత్‌లో జియోడౌన్ అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతున్నట్లు డౌన్‌ డిటెక్టర్‌ తెలిపింది. ఇప్పటివరకు దాదాపు 4 వేల మంది వినియోగదారులు ఈ నెట్‌వర్క్‌ సమస్యను నివేదించారు. అయితే, ఈ సమస్య తాత్కాలికమేనని, పరిష్కారం కోసం తమ బృందం పనిచేస్తున్నట్లు కస్టమర్ కేర్ నుంచి సమాధానం వచ్చినట్లు చెప్పింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డేట్స్ లేకపోయినా అడ్జెస్ట్ చేసుకుని అఖండలో నటించా : సంయుక్తా

Sri Nandu: డెమో లాగా సైక్ సిద్ధార్థ షూట్ చేస్తే ఓటీటీ నుంచి ఆఫర్ వచ్చింది : శ్రీ నందు

Boman Irani: రాజా సాబ్ నుంచి బొమన్ ఇరానీ బర్త్ డే పోస్టర్

బాలకృష్ణ 'అఖండ-2'కు టిక్కెట్ ధరలు పెంపు

రాగ్ మయూర్, మెరిన్ ఫిలిప్ జంటగా అనుమాన పక్షి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments