Webdunia - Bharat's app for daily news and videos

Install App

రిలయన్స్ జియో కొత్త ప్లాన్.. జియో లింక్ పేరుతో.. 90 రోజులు ఉచిత డేటా

దేశ వ్యాప్తంగా ఉచిత డేటాతో సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో ప్రస్తుతం తన వినియోగదారుల సంఖ్యను మరింత పెంచుకునే దిశగా సరికొత్త సేవలను తీసుకురాబోతుంది. ఇందులో భాగంగా జియో లింక్ పేరుతో దేశంలోని కొన్ని ప్రా

Webdunia
మంగళవారం, 26 జూన్ 2018 (11:02 IST)
దేశ వ్యాప్తంగా ఉచిత డేటాతో సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో ప్రస్తుతం తన వినియోగదారుల సంఖ్యను మరింత పెంచుకునే దిశగా సరికొత్త సేవలను తీసుకురాబోతుంది. ఇందులో భాగంగా జియో లింక్ పేరుతో దేశంలోని కొన్ని ప్రాంతాల్లో కొత్త సేవలను ప్రారంభించింది. దశల వారీగా ఈ సేవలు దేశ వ్యాప్తంగా అమల్లోకి తెచ్చేందుకు జియో రంగం సిద్ధం చేస్తోంది.
 
ఈ ప్లాన్‌లో భాగంగా రూ. 2,500తో సెట్ టాప్ బాక్సును పోలి ఉండే ఒక చిన్న పరికరాన్ని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. శాటిలైట్ డిష్ లాంటి ఒక చిన్న పరికరాన్ని భవనం పైభాగంలో అమర్చి, కేబుల్ ద్వారా భవనంలోని రూటర్‌కు కలుపుతారు. దీని ద్వారా హైస్పీడ్ వైఫై సేవలు అందుబాటులోకి వస్తాయి. ఈ జియో లింక్ ద్వారా 90 రోజుల వరకు ఈ సేవలు ఉచితంగా లభిస్తాయి. ఆ తర్వాత రూ. 699తో రోజుకు 5జీబీ డేటా వంతున 28 రోజుల వరకు... రూ. 2,099తో రోజుకు 5జీబీ డేటా వంతున 98 రోజుల వరకు సేవలను పొందవచ్చునని జియో ఓ  ప్రకటనలో వెల్లడించింది. 
 
అలాగే రూ. 4,199తో 196 రోజుల వరకు డేటా పొందే ప్లాన్ కూడా వుంది. ఇకపోతే ఈ ప్లాన్ ద్వారా నేరుగా వాయిస్ కాల్స్ చేసుకునే అవకాశం ఉండదు. కానీ, ఫేస్‌బుక్, వాట్సాప్ వంటి మాధ్యమాల ద్వారా వాయిస్ కాల్స్ చేసుకోవచ్చునని జియో ప్రకటించింది. హోటల్స్, మాల్స్, కార్యాలయాలు, అపార్ట్ మెంట్లు తదితర ప్రాంతాల్లో జియో లింక్ ఇండోర్ వైఫై హాట్ స్పాట్‌గా ఉపయోగపడుతున్న సంగతి తెలిసిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments