Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొత్త కస్టమర్లకు ఉచితంగా జియో బ్రాడ్‌బ్యాండ్ సేవలు

Webdunia
మంగళవారం, 24 మార్చి 2020 (08:37 IST)
దేశీయ టెలికాం రంగాన్ని శాసిస్తున్న రిలయన్స్ జియో.. తాజాగా మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది. కొత్తగా బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ తీసుకునే వారికి ఉచితంగా సేవలు అందించనున్నట్టు ప్రకటించింది. ముఖ్యంగా, కరోనా వైరస్‌ నేపథ్యంలో ఇంటి నుంచి పనిచేసేవారికి ప్రయోజనం కల్పించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. 
 
నిజానికి జియో ఫైబర్‌ బ్రాడ్‌బ్యాండ్‌ కస్టమర్‌ కొత్తగా ఒక కనెక్షన్‌ పొందడానికి రూ.2,500 చెల్లించాల్సి ఉండగా, వీటిలో రూ.1,500 రిఫండ్‌ కింద చెల్లిస్తారు. మినిమమ్‌ రీఫండబుల్‌ డిపాజిట్‌ తీసుకుని హోం గేట్‌వే రూటర్‌ను అందిస్తున్నారు. అలాగే, కంపనీ డాటా ఆడ్‌ ఆన్‌ ఓచర్లపై డబుల్‌ డాటాను అందిస్తుంది. నాన్‌ జియో వాయిస్‌ కాల్స్‌పై కూడా నిమిషాలను పెంచింది. 
 
కాగా, ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ తమ కస్టమర్లకు వర్క్‌ ఫ్రం హోం సౌకర్యం కోసం కొత్త కనెక్షన్లకు ఫ్రీ బ్రాడ్‌ బాండ్‌ ప్లాన్‌ అందిస్తున్నట్లు ప్రకటించింది. ఇపుడు ఈ దిశలోనే రిలయన్స్ జియో కూడా ముందుకు వచ్చింది. కరోనా వైరస్ భయం కారణంగా అన్ని కంపెనీలు తమతమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం వెసులుబాటును కల్పించిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments