ఆపిల్, శామ్‌సంగ్‌కు చుక్కలు చూపిస్తున్న జియోమీ.. ఎలా?

Webdunia
మంగళవారం, 5 ఫిబ్రవరి 2019 (19:17 IST)
అత్యాధునిక సాంకేతికతతో, చౌకధరలో మొబైల్ ఫోన్లను వినియోగదారులకు అందించేందుకు జియోమీ సంస్థ ఎప్పుడూ ముందుంటుంది. చౌకధరలో ఫోన్లను అందించడంలో ఆపిల్, శామ్‌సంగ్ వంటి సంస్థలకు జియోమీ చుక్కలు చూపిస్తోంది. ఈ సంస్థకు చెందిన రెడ్‌ మీ సిరీస్ ఫోన్లు అద్భుతంగా పనిచేయడంతో.. వినియోగదారులు జియోమీపై ఎక్కువ మక్కువ చూపుతున్నారు. 
 
జియోమీకి చెందిన చౌక ఫోన్లు, ఇతరత్రా ఫోన్లపై ఒక్కో అప్‌డేట్‌ను స్వాగతిస్తున్నారు. ఇటీవల రెడ్‌ మీ 7 సెల్‌ఫోన్‌ను జియోమీ చైనాలో విడుదల చేసింది. అక్కడ జియోమీకి చెందిన Redmi Note 7 Proను మార్కెట్లోకి ప్రవేశపెట్టనున్నట్లు సీఈవో తెలిపారు. ఈ ఫోన్‌లో సోనీ ఐఎమ్ఎస్ 86 సెన్సార్ వుంటుందని.. 48 మెగాపిక్సల్ కెమెరా వుంటుందని చెప్పారు. 
 
3జీబీ రామ్, 32జీబీ స్టోరేజ్, 6జీబీ రామ్, 128 జీబీ స్టోరేజ్ ఫీచర్లు వున్నాయి. ఈ ఫోన్ ధర రూ.15,800లుగా వుంటుందని జియోమీ సంస్థ వెల్లడించింది. జూన్ నెలలో రెడ్ మీ నోట్ 7 ప్రోను విడుదల చేసేందుకు సిద్ధంగా వున్నట్లు తెలుస్తోంది. అంతేగాకుండా ఇంకా పలు ఫీచర్లతో కూడిన స్మార్ట్ ఫోన్లను ప్రవేశపెట్టేందుకు జియోమీ సన్నద్ధమవుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

2016లో విడాకులు తీసుకున్నారు... 2026లో మళ్లీ ఒక్కటైన సినీ సెలెబ్రిటీలు

కొత్త చిత్రాలకు కమిట్ కాలేదు.. 'ఓజీ-2'పై త్వరలో అప్‌డేట్

ప్రధాని మోడీ వల్లే దేశ ప్రజలు ప్రశాంతంగా జీవిస్తున్నారు : రేణు దేశాయ్

Prabhas: శర్వా.. బైకర్ ట్రైలర్‌ పై ప్రశంసలు కురిపించిన ప్రభాస్

Dil Raju: గాయపడ్డ సింహం విడుదల చేస్తాం, కానీ కండిషన్స్ అప్లై : దిల్ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుచ్చకాయ తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఆనందం, ఆదరణ, నివారణ సంరక్షణతో వృద్ధాప్యాన్ని పునర్నిర్వచించాలని జాతీయ పిలుపు

మార్కెట్లోకి నకిలీ కోడిగుడ్లు, గుర్తించడం ఎలా?

డానోన్ ఇండియా రక్తహీనతపై పోరాటానికి సహాయం చేస్తామని ప్రతిజ్ఞ

టైప్ 2 మధుమేహుల కోసం డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ సెమాగ్లుటైడ్ ఇంజెక్షన్ ఒబెడా విడుదల

తర్వాతి కథనం
Show comments