రిలయన్స్ జియోకు మహర్ధశ : క్వాల్‌కామ్ పెట్టుబడులు

Webdunia
సోమవారం, 13 జులై 2020 (10:37 IST)
దేశ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ జియోకు కరోనా కష్టకాలం బాగా కలిసివచ్చినట్టుగా తెలుస్తోంది. కరోనా లాక్డౌన్ వేళ అనేక కంపెనీలు తీవ్రంగా నష్టపోతున్నాయి. మరికొన్ని కంపెనీలు ఇతర కంపెనీల్లో పెట్టిన పెట్టుబడులను ఉపసంహరించుకునే పనిలో నిమగ్నమయ్యాయి. అయితే, రిలయన్స్ జియో పరిస్థితి మరోలా వుంది. రిలయన్స్ జియో ఫ్లాట్‌ఫామ్స్‌లో పెట్టుబడులు పెట్టేందుకు అనేక కంపెనీలు అమితాసక్తిని చూపుతున్నాయి. తాజాగా క్వాల్‌కామ్ కంపెనీ పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చింది. 
 
నిజానికి గత ఏప్రిల్ 22 నుంచి కేవలం 12 వారాల వ్యవధిలో 11 కంపెనీల నుంచి రిలయన్స్ జియో పెట్టుబడులను ఆకర్షించింది. తద్వారా సుమారు 1.17 లక్షల కోట్ల రూపాయలకుపైగా పెట్టుబడులను రాబట్టింది. ఇపుడు జియో ప్లాట్ ఫామ్స్‌లో 0.15 శాతం వాటాను కొనుగోలు చేసేందుకు రూ.730 కోట్లను క్వాల్ కామ్ ఇన్వెస్ట్ చేయాలని నిర్ణయించింది. 
 
ఈ విషయాన్ని స్వయంగా ఓ మీడియా ప్రకటన ద్వారా వెల్లడించిన రిలయన్స్, దీంతో జియో ప్లాట్ ఫామ్స్‌లో పెట్టుబడులు రూ.1,18,318.45 కోట్లకు చేరుకున్నాయని ప్రకటించింది. కాగా, క్వాల్ కామ్, టెక్నాలజీ సేవలను ప్రపంచవ్యాప్తంగా అందిస్తున్న సంగతి తెలిసిందే. 
 
ఇండియాలోనూ క్వాల్ కామ్‌కు ఆఫీసులున్నాయి. ఇప్పటికే జియో ప్లాట్ ఫామ్స్‌లో ఫేస్ బుక్, సిల్వర్ లేక్, విస్టా ఈక్విటీ, జనరల్ అట్లాంటిక్, కేకేఆర్, ముబాదలా, ఏడీఐఏ, టీపీజీ, ఎల్ కాటర్ టన్, పీఐఎఫ్, ఇంటెల్ కాపిటల్ సంస్థలు పెట్టుబడులు పెట్టిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీ తల్లిదండ్రులను - దేవుడుని ఆరాధించండి : శివకార్తికేయన్

బాధితురాలిగా విలన్ భలే యాక్ట్ చేసింది: సమంత మాజీ మేకప్ ఆర్టిస్ట్ సాధన పోస్ట్

Prabhas: స్పిరిట్ కోసం పోలీస్ గెటప్ లో యాక్షన్ చేస్తున్న ప్రభాస్ తాజా అప్ డేట్

Anil ravipudi: చిరంజీవి, వెంకటేష్ డాన్స్ ఎనర్జీ కనువిందు చేస్తుంది : అనిల్ రావిపూడి

Ravi Teja: రవితేజ, ఆషికా రంగనాథ్‌ పై జానపద సాంగ్ బెల్లా బెల్లా పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

తర్వాతి కథనం
Show comments