Webdunia - Bharat's app for daily news and videos

Install App

పీఎఫ్ ఖాతాను సెప్టెంబర్ 1లోపు ఆధార్‌తో లింక్ చేయాలి

Webdunia
సోమవారం, 9 ఆగస్టు 2021 (10:35 IST)
ఉద్యోగులు తమ ప్రావిడెంట్‌ ఫండ్‌ (పీఎఫ్‌) ఖాతాను వచ్చేనెల 1లోపు ఆధార్‌ కార్డుతో అనుసంధానించాలని ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) వెల్లడించింది. ఆధార్‌తో అనుసంధానం చెందని పీఎఫ్‌ ఖాతాల్లో సెప్టెంబర్‌ 1 నుంచి అన్ని చెల్లింపులను నిలిపివేస్తామని ప్రకటించింది. ఈ మేరకు కోడ్‌ ఆఫ్‌ సోషల్‌ సెక్యూరిటీ 2020 సెక్షన్‌ 142 నిబంధనను ఉటంకించింది. 
 
ఉద్యోగుల పీఎఫ్‌ ఖాతాల సమాచారం వాళ్లు పనిచేసే సంస్థల దగ్గర ఉండటం వల్ల.. యాజమాన్యమే ఉద్యోగి ఆధార్‌ను పీఎఫ్‌ ఖాతాతో అనుసంధానించాలని ఈపీఎఫ్‌వో ఒక నోటిఫికేషన్‌లో పేర్కొన్నట్టు ఎల్‌ అండ్‌ ఎల్‌ పార్టనర్స్‌ డైరెక్టర్‌ అమృత టోంక్‌ అన్నారు. కాగా, పీఎఫ్‌ ఖాతాతో ఆధార్‌ అనుసంధానాన్ని తప్పనిసరి చేసిన ఈపీఎఫ్‌వో.. తొలుత జూన్‌ 1ని తుది గడువుగా పేర్కొంది. తాజాగా ఆ తేదీని సెప్టెంబర్‌ 1కి పొడిగించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా మనసుకు చేరువైన పాత్ర ఏదీ లేదు : పవన్ కళ్యాణ్

హీరో విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేసు

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments