చైనాకు చెందిన మొబైల్స్ తయారీదారు సంస్థ ఒప్పో రెనో సిరీస్లో సరికొత్తగా రెనో పేరిట ఓ స్మార్ట్ఫోన్ను ఇవాళ చైనా మార్కెట్లో విడుదల చేసింది. రెనో స్టాండర్డ్ ఎడిషన్, రెనో 10ఎక్స్ హైబ్రిడ్ ఆప్టికల్ జూమ్ ఎడిషన్లలో ఈ ఫోన్ వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది.
రూ.30,895 ప్రారంభ ధరకు రెనో స్టాండర్డ్ ఎడిషన్ లభ్యం కానుండగా, రూ.41,190 ప్రారంభ ధరకు రెనో 10ఎక్స్ జూమ్ ఎడిషన్ లభ్యం కానుంది. ఈ నెల 16వ తేదీ నుంచి స్టాండర్డ్ ఎడిషన్ను విక్రయించనున్నారు. జూమ్ ఎడిషన్ను మే నెల ఆరంభం నుంచి విక్రయిస్తారు.