మొబైల్ల తయారీ రంగంలో చైనాకు చెందిన ఒప్పో సరికొత్త మోడల్లను మార్కెట్లోకి విడుదల చేస్తూ సాటి మొబైల్ కంపెనీలకు గట్టి పోటీని ఇస్తోంది. కాగా దేశీయంగా వివిధ కంపెనీల నుండి ఎదురవుతున్న పోటీని తట్టుకోవడానికి 'కె' సిరీస్లో కొత్త ఫోన్ని అందుబాటులోకి తెచ్చింది. కంపెనీ బుధవారం నాడు 'కె' సిరీస్లో భాగంగా ఒప్పో 'కె1' స్మార్ట్ఫోన్2ని ఆవిష్కరించింది.
ప్రపంచవ్యాప్తంగా 'కె' సిరీస్ స్మార్ట్ఫోన్లకు లభిస్తున్న ఆదరణ కారణంగానే 'కే1'ను తీసుకువస్తున్నట్లు ఒప్పో ఇండియా బ్రాండ్ డైరెక్టర్ విల్ యాంగ్ తెలిపారు. ఫిబ్రవరి 12వ తేదీ నుండి ఫ్లిప్కార్ట్లో ఈ స్మార్ట్ఫోన్ అందుబాటులోకి వస్తుందని కంపెనీ తెలిపింది. అయితే భారత్లో 'కె1' స్మార్ట్ఫోన్ ధర రూ. 16,990గా నిర్ణయించబడింది.