Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒప్పోకి కరోనా సెగ.. ఆరుగురు ఉద్యోగులకు కరోనా.. కంపెనీ షట్ డౌన్

Webdunia
సోమవారం, 18 మే 2020 (13:08 IST)
ప్రముఖ మొబైల్ కంపెనీ ఒప్పోకి కూడా కరోనా సెగ తాకింది. ఒప్పోకు చెందిన ఆరుగురు ఉద్యోగులకు కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించిన ఒప్పో.. ఫలితంగా యూపీలోని గ్రేటర్ నోయిడాలోని ఒప్పో ఫ్యాక్టరీని మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఆరుగురు ఉద్యోగులకు కరోనా పాజిటివ్ అని తేలటంతో కంపెనీలోని మరో మూడు వేలమంది ఉద్యోగులకు కూడా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు.
 
కరోనా వైరస్‌ విస్తరించకుండా ఉండటానికి కేంద్ర ప్రభుత్వం మార్చి 24న దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించిన సంగతి తెలిసిందే. దీంతో నోయిడా పారిశ్రామిక వాడలోని ఒప్పో మొబైల్‌ ఫోన్ల తయారీ కేంద్రంలో కార్యకలాపాలు నిలిచిపోవటం.. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నిబంధనల సడలింపులతో తిరిగి మే 8న కంపెనీ ప్రారంభమైంది. 
 
అయితే ప్రస్తుతం ఒప్పోలో పనిచేసే మూడు వేలకుపైగా ఉద్యోగులకు కరోనా పరీక్షలు నిర్వహించగా ఆరుగురు ఉద్యోగులకు కరోనా పాజిటివ్ అని తేలింది. మూడు వేల మంది ఉద్యోగుల కరోనా టెస్టు ఫలితాల కోసం వేచి చూస్తున్నట్లు ఒప్పో తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

త్వరలోనే తల్లి కాబోతున్న పవన్ హీరోయిన్ పార్వతీ మెల్టన్

బాలీవుడ్ నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ అలా మోసం చేశారా?

Bellamkonda: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కిష్కింధాపురి లో అమ్మాయి అదృశ్యం వెనుక వుంది ఎవరు...

రూ.100 కోట్ల క్లబ్ దిశగా కళ్యాణి ప్రియదర్శన్ 'లోకా' పరుగులు

సోనీ పిక్చర్స్ సిసు: రోడ్ టు రివెంజ్ నాలుగు భాషల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Lotus Root: తామర పువ్వు వేర్లను సూప్స్‌, సలాడ్స్‌లో ఉపయోగిస్తే?

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

తర్వాతి కథనం
Show comments