Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫ్లిఫ్‌కార్ట్ సరికొత్త రికార్డ్.. ఒక్కరోజులో 30లక్షల స్మార్ట్‌ఫోన్లు సేల్

ప్రముఖ ఈ కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ రికార్డు సృష్టించింది. స్మార్ట్‌ఫోన్ల అమ్మకాల్లో కొత్త రికార్డును సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో భారత రిటైల్‌ మార్కెట్‌ చరిత్రలోనే ఒక్కరోజులో అత్యధికంగా ఫోన్ల అమ్మ

Webdunia
శుక్రవారం, 12 అక్టోబరు 2018 (15:06 IST)
ప్రముఖ ఈ కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ రికార్డు సృష్టించింది. స్మార్ట్‌ఫోన్ల అమ్మకాల్లో కొత్త రికార్డును సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో భారత రిటైల్‌ మార్కెట్‌ చరిత్రలోనే ఒక్కరోజులో అత్యధికంగా ఫోన్ల అమ్మకాలు చేపట్టిన సంస్థగా ఫ్లిఫ్ కార్ట్ అవతరించింది. దసరా పండగ సందర్భంగా ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ బిలియన్‌ డే సేల్‌ను నిర్వహిస్తోంది. 
 
ఈ ఆఫర్ ఈ నెల పదో తేదీన వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. ఫ్లిప్‌కార్ట్‌ 10-14 తేదీ వరకు బిగ్‌ బిలియన్‌ డే పేరిట ఆఫర్లను ప్రకటించింది. స్మార్ట్‌ఫోన్లపై ఫ్లిప్‌కార్ట్‌ అత్యధికంగా డిస్కౌంట్‌ను, క్యాష్‌బ్యాక్‌ను ప్రకటించింది. పండగ సేల్‌ సందర్భంగా ఫ్లిప్‌కార్ట్‌ 30వేల మందికి తాత్కాలిక ఉద్యోగాలను కూడా కల్పించింది. 
 
ఈ నేఫథ్యంలో ఈ సేల్ ప్రారంభమైన తొలి రోజునే కంపెనీల స్మార్ట్ ఫోన్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. ఇందులో భాగంగా తొలి గంటలో సుమారు పది లక్షల ఫోన్లు అమ్ముడుపోయాయి. ఒక్కరోజులో 30లక్షల స్మార్ట్‌ఫోన్లు అమ్ముడుపోయినట్లు ఫ్లిప్‌కార్ట్‌ సీనియర్‌ డైరెక్టర్‌ స్మృతి రవిచంద్రన్‌ ప్రకటించారు. 
 
భారత రిటైల్‌ మార్కెట్‌ చరిత్రలో ఒక్కరోజులోనే అత్యధిక స్మార్ట్‌ఫోన్లు అమ్మినట్లు స్మృతి రవిచంద్రన్ తెలిపారు. రియల్‌మి, షామీ, శాంసంగ్‌, నోకియా, ఆసుస్‌, ఇన్ఫినిక్స్‌, హానర్‌ కంపెనీలకు చెందిన స్మార్ట్‌ఫోన్లు అత్యధికంగా అమ్ముడుపోయాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments