Webdunia - Bharat's app for daily news and videos

Install App

No NEFT service.. 14 గంటల వరకు బంద్.. ఎప్పుడంటే?

Webdunia
సోమవారం, 17 మే 2021 (17:39 IST)
అసలే లాక్‌డౌన్.. ఏటీఎంల వెంట పడకుండా నెఫ్ట్, ఆన్ లైన్ లావాదేవీలు కానిచ్చేస్తున్నారు జనం. అయితే తాజాగా నెఫ్ట్ సేవలు 14 గంటల పాటు నిలిచిపోనున్నాయి. దాదాపు 14 గంటల పాటు నెఫ్ట్ ఆన్ లైన్ లావాదేవీలకు అంతరాయం ఏర్పడనుంది. మే 23 ఆదివారం 14 గంటల వరకు నెఫ్ట్ సేవలు పనిచేయవమని రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఒక ప్రకటనలో వెల్లడించింది.
 
సాంకేతిక కారణాల రీత్యా నెఫ్ట్ సేవలు నిలిపివేస్తున్నట్టు పేర్కొంది. టెక్నికల్ అప్ గ్రేడ్ కోసం మే 22న బిజినెస్ అవర్స్ ముగిసిన తర్వాత సాప్ట్ వేర్ అప్ గ్రేడ్ చేయనున్నట్టు తెలిపింది. మే 23న 00.01 గంటల నుంచి (మే 22 అర్ధరాత్రి 12 గంటల నుంచి) మధ్యాహ్నం 2 గంటల వరకు నెఫ్ట్ సేవలు అందుబాటులో ఉండవు.
 
మరోవైపు ఆర్టీజీఎస్ సేవలు మాత్రం యథావిధిగా కొనసాగుతాయని ఆర్‌బీఐ తెలిపింది. నెఫ్ట్ సేవలకు సంబంధించి ప్రతి బ్యాంకు తమ కస్టమర్లకు సమాచారం అందిస్తాయని తెలిపింది. 
 
ఏప్రిల్‌ 18న ఆర్టీజీఎస్ సాంకేతిక వ్యవస్థలోనూ రిజర్వ్‌ బ్యాంక్ టెక్నికల్‌ అప్‌గ్రేడ్‌ చేసింది. 2019 డిసెంబరు నుంచి నెఫ్ట్ సేవలను 24×7 గంటల పాటు అందుబాటులోకి వచ్చాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తగ్గెదేలే అంటూ పుష్ప 2 పాటకు డాన్స్ చేసిన బాలక్రిష్ణ, అల్లు అరవింద్

మేం పడిన కష్టానికి తగిన ప్రతిఫలం వచ్చింది- మోతెవరి లవ్ స్టోరీ హీరో అనిల్ గీలా

వార్ 2 కథలోని సీక్రెట్స్ రివీల్ చేయకండి- హృతిక్, ఎన్టీఆర్ రిక్వెస్ట్

అధర్మం చేస్తే దండన - త్రిబాణధారి బార్బరిక్ ట్రైలర్‌తో అంచనాలు

ఫెడరేషన్ చర్చలు విఫలం - వేతనాలు పెంచలేమన్న నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments