Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.4 వేలకే స్మార్ట్ ఫోన్.. ముఖేష్ అంబానీ తదుపరి ఆయుధం ఇదే...

Webdunia
బుధవారం, 23 సెప్టెంబరు 2020 (09:40 IST)
రిలయన్స్ ఇండస్ట్రీ అధినేత ముఖేష్ అంబానీ సంచలనాలకు కేంద్ర బిందువుగా మారారు. దేశంలో స్వదేశీ టెలికాం సేవలను ప్రారంభించి నవశకానికి నాంది పలికారు. ఆయన నేతృత్వంలోని రిలయన్స్ జియో ఇపుడు దేశంలోనే అత్యున్నత స్థాయి సేవలతో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఈ నేపథ్యంలో ముఖేష్ అంబానీ మరో లక్ష్యాన్ని ఎంచుకున్నారు. 
 
కరోనా మహమ్మారి కారణంగా విద్యార్థులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. పాఠశాలలన్నీ ఇపుడు ఆన్‌లైన్ క్లాసుల వైపు మొగ్గు చూపుతున్నాయి. అయితే, దీనికి స్మార్ట్ ఫోన్ తప్పనిసరి. కానీ, కోట్లాది మంది విద్యార్థులకు ఈ తరహా ఫోన్లు లేవు. దీంతో త్వరలో రూ.4 వేలకే అన్ని ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్‌ను దేశ ప్రజలకు పరిచయం చేయాలని ఆయన భావిస్తున్నారు. 
 
దేశ మొబైల్‌ఫోన్‌ రంగంలో మరింతగా దూసుకుపోయేలా ముఖేశ్‌ అంబానీ కొత్తగా 'జియో స్మార్ట్‌ఫోన్'పై దృషి సారించారని విశ్వసనీయవర్గాలు తెలిపాయి. రెండేళ్లలో 20 కోట్ల స్మార్ట్‌ఫోన్లను దేశీయంగా తయారు చేయించాలని ఆయన నిర్ణయించినట్లు తెలిసింది. నిజానికి స్మార్ట్‌ఫోన్‌ కొనలేని పరిస్థితుల్లో ఉన్న 50 కోట్ల మంది అర చేతుల్లో 'జియో స్మార్ట్‌ఫోన్' ఉండాలని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు. 
 
కానీ, దేశీయ ఉత్పత్తి రంగం ఆ టార్గెట్‌ను అందుకోవడం సాధ్యం కాకపోవడంతో.. రెండేళ్ల కాలంలో 20 కోట్ల ఫోన్ల తయారీపై దృష్టిసారించారు. అంబానీ తాజా నిర్ణయం దేశీయ స్మార్ట్‌ఫోన్ల ఉత్పత్తిదారులకు ఊతమిచ్చినట్లవుతుందని ఇండియన్‌ సెల్యూలర్‌ అండ్‌ ఎలక్ట్రానిక్ అసోసియేషన్‌ ఛైర్మన్‌ పంకజ్‌ మొహింద్రూ అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రేమలో పూర్తిగా మునిగిపోతే తికమక చేస్తుంది : త్రిష

Samantha: సమంతకి సినిమా కష్టాలు - రక్త్ బ్రహ్మాండ్ వెబ్ సిరీస్‌ హుష్ కాకీ

Mohanbabu: కన్నప్ప షూటింగ్ న్యూజిలాండ్ లోనే ఎందుకు చేశారో తెలుసా

సారీ మాత్రమే చెప్పగలను... ఎక్కువ అంచనా వేసి బోల్తాపడ్డాం : మణిరత్నం

Nidhi: రాజా సాబ్ తో గ్లామర్ డోస్ పెంచుకున్న నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

తర్వాతి కథనం
Show comments