Webdunia - Bharat's app for daily news and videos

Install App

మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్యనాదెళ్లకు పుత్రశోకం

Webdunia
మంగళవారం, 1 మార్చి 2022 (12:49 IST)
మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్యనాదెళ్ల పుత్రశోకం కలిగింది. సత్యనాదెళ్ల కుమారుడు జైన్‌ నాదెళ్ల (26) ప్రాణాలు కోల్పోయారు. పుట్టుకతోనే సెరిబ్రల్‌ పక్షవాతంతో బాధపడుతున్న జైన్‌ .. సోమవారం తీవ్ర అనారోగ్యానికి గురై మరణించినట్లు ఆ సంస్థ తెలిపింది.  
 
ఈ విషయాన్ని మైక్రోసాఫ్ట్‌ సంస్థ తన ఎగ్జిక్యూటివ్‌ సిబ్బందికి ఈ-మెయిల్‌ ద్వారా వెల్లడించింది. అలాగే జైన్‌ మృతికి సంతాపం ప్రకటించింది. సత్య నాదెళ్ల, అను దంపతుల పెద్ద కుమారుడు జైన్‌ 1996లో జన్మించాడు. అయితే జైన్‌ తీవ్రమైన సెరెబ్రల్‌ పాల్సీ లక్షణాలతో పుట్టినట్లు వైద్యులు గుర్తించారు. 
 
అప్పటి నుంచి అతడు వీల్‌ ఛెయిర్‌కే పరిమితమయ్యారు. దీంతో 2014లో మైక్రోసాఫ్ట్‌ సిఇఒగా బాధ్యతలు చేపట్టినప్పటి నుండి సత్య నాదెళ్ల విభిన్న ప్రతిభావంతుల కోసం వినూత్న పరికరాలను రూపొందించడంపై దృష్టిపెట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

తర్వాతి కథనం
Show comments