Webdunia - Bharat's app for daily news and videos

Install App

రిలయన్స్ జియో నుంచి చౌక ధరకే స్మార్ట్ ఫోన్

Webdunia
శుక్రవారం, 25 జూన్ 2021 (08:25 IST)
దేశీయ టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులకు కారణమైన రిలయన్స్ జియో మరో సరికొత్త ఆవిష్కరణకు శ్రీకారం చుట్టనుంది. దేశంలోనే అతి తక్కువ ధరకు స్మార్ట్ ఫోన్‍ను ఆవిష్కరించనుంది. దీనికి జియో ఫోన్ నెక్ట్స్ అనే పేరు పెట్టారు. 
 
ఇంతకుముందు జియో ఫోన్ పేరిట ఫీచర్ ఫోన్ తీసుకువచ్చిన రిలయన్స్ ఇప్పుడు పూర్తిస్థాయి స్మార్ట్ ఫోన్‌తో రంగంలోకి దిగుతోంది. ఈ ఏడాది సెప్టెంబరులో వినాయకచవితి సందర్భంగా దీన్ని మార్కెట్లోకి విడుదల చేసేలా ప్రణాళికలు రూపొందించింది. 
 
సెప్టెంబరు 10 నుంచి జియో ఫోన్ నెక్ట్స్ అందుబాటులోకి వస్తుందని రిలయన్స్ వర్గాలు వెల్లడించాయి. గురువారం జరిగిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) 44వ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఈ స్మార్ట్ ఫోన్ వివరాలను వెల్లడించారు. 
 
ఇకపోతే, ఈ ఫోన్‌ను రిలయన్స్ జియో, గూగుల్ కలిసి తయారు చేసింది. 4జీ టెక్నాలజీతో తయారైన ఈ ఫోన్... గూగుల్ జియో కోసమే ప్రత్యేకంగా రూపొందించిన ఆప్టిమైజ్డ్ ఆండ్రాయిడ్ ఓఎస్‌ను దీంట్లో ఉపయోగించారు. 
 
రెగ్యులర్ ఆండ్రాయిడ్ అప్ డేట్లను ఇది స్వీకరిస్తుంది. రియాలిటీ ఫిల్టర్స్ కూడిన స్మార్ట్ కెమెరా ఈ ఫోన్‌కు ప్రత్యేకం అని చెప్పాలి. వాయిస్ అసిస్టెంట్, లాంగ్వేజ్ ట్రాన్స్‌లేషన్, ఆటోమేటిక్ టెక్ట్స్ రీడ్ అలౌడ్ వంటి ఫీచర్లు ఇందులో ఇన్ బిల్ట్‌గా లభిస్తాయి. అయితే ఈ ఫోన్ ధరను మాత్రం ఈ ఏజీఎం సమావేశంలో వెల్లడించలేదు. 

సంబంధిత వార్తలు

హాలీవుడ్ ఫిల్మ్ మేకింగ్ స్టైల్ లో హనీమూన్ ఎక్స్ ప్రెస్ : చిత్ర యూనిట్

కోలీవుడ్‌లో విషాదం : 'మహారాజ' నటుడు ప్రదీప్ కన్నుమూత

చంద్రబాబు గారిని కలిసి కుప్పం బ్యాక్ డ్రాప్ లో సినిమా చేశానని ని చెప్పా : హీరో సుధీర్ బాబు

సెప్టెంబ‌ర్ 27న ఎన్టీఆర్ భారీ పాన్ ఇండియా మూవీ దేవర గ్రాండ్ రిలీజ్

మమ్ముట్టితో సమంత యాడ్ ఫిల్మ్

ఉడికించిన కూరగాయలు ఎందుకు తినాలో తెలిపే 8 ప్రధాన కారణాలు

ఈ 7 పదార్థాలు శరీరంలో యూరిక్ యాసిడ్‌ని పెంచుతాయి, ఏంటవి?

అంజీర పండు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

బ్రెయిన్ ట్యూమర్ సర్వైవర్స్‌తో అవగాహన వాకథాన్‌ని నిర్వహించిన కేర్ హాస్పిటల్స్, హైటెక్ సిటీ

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలిపే 9 కారణాలు

తర్వాతి కథనం
Show comments