Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎయిర్‌టెల్‌కు చెక్.. జియో డబుల్ ధమాకా... రోజూ అదనంగా 1.5జీబీ ఫ్రీ

దేశీయ టెలికాం రంగంలో సంచలనాలకు కేంద్రబిందువుగా మారిన రిలయన్స్ జియో తాజా మరో బంపర్ ఆఫర్‌తో ముందుకొచ్చింది. జియో తన ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్యాక్‌లపై అదనంగా 1.5జీబీ డేటాను ఉచితంగా ఇవ్వనున్నట్లు ప్రకటించింద

Webdunia
బుధవారం, 13 జూన్ 2018 (08:21 IST)
దేశీయ టెలికాం రంగంలో సంచలనాలకు కేంద్రబిందువుగా మారిన రిలయన్స్ జియో తాజా మరో బంపర్ ఆఫర్‌తో ముందుకొచ్చింది. జియో తన ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్యాక్‌లపై అదనంగా 1.5జీబీ డేటాను ఉచితంగా ఇవ్వనున్నట్లు ప్రకటించింది.
 
ఈ ఆఫర్ జూన్ 12వ తేదీ నుంచి జూన్‌ 30వ తేదీ వరకు మాత్రమే యూజర్లకు అందుబాటులో ఉంటుంది. డబుల్‌ ధమాకా ఆఫర్‌‌తో పాటు, ఈ ఆపరేటర్‌ కొత్తగా రూ.499 రీఛార్జ్‌ ప్యాక్‌‌ను కూడా 3 నెలల వాలిడిటీతో లాంచ్‌ చేసింది. ఈ కొత్త ప్యాక్‌‌పై రోజుకు 3.5జీబీ డేటా అందించనున్నట్టు తెలిపింది.
 
జియో డబుల్‌ ధమాకా ఆఫర్‌ మేరకు.. 
రోజుకు 1.5జీపీ డేటా పొందే రూ.149, రూ.349, రూ.399, రూ.449 ప్యాక్‌ యూజర్లు ఇక నుంచి రోజుకు 3జీబీ డేటా పొందనున్నారు.
రోజుకు 2జీబీ డేటా పొందే రూ.198, రూ.398, రూ.448, రూ.498 ప్యాక్‌ యూజర్లకు ఇక నుంచి రోజుకు 3.5జీబీ డేటా లభ్యం.
రోజుకు 3జీబీ డేటా పొందే రూ.299 ప్యాక్‌ యూజర్లు ఇక నుంచి రోజుకు 4.5జీబీ డేటా వస్తుంది.
రోజుకు 4జీబీ డేటా పొందే రూ.509 ప్యాక్‌ యూజర్లకు ఇక నుంచి రోజుకు 5.5జీబీ డేటా లభ్యం.
రోజుకు 5జీబీ డేటా పొందే రూ.799 ప్యాక్‌ యూజర్లు ఇక నుంచి రోజుకు 6.5జీబీ డేటా పొందనున్నారు.
 
అంతేకాకుండా, 300 రూపాయలు, ఆపై మొత్తాల అన్ని రీఛార్జ్‌‌లపై జియో 100 రూపాయల డిస్కౌంట్‌ ఆఫర్‌ చేయనుంది. 300 రూపాయల కంటే తక్కువ మొత్తాల రీఛార్జ్‌‌లపై 20 శాతం తగ్గింపు ఇస్తోంది. అయితే ఈ డిస్కౌంట్‌‌ల కోసం మైజియో యాప్‌, పేటీఎం వాడుతూ.. ఫోన్‌ పే వాలెట్‌ ద్వారానే రీఛార్జ్‌ చేయించుకోవాలని తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments