Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జియోకు ధీటుగా ఎయిర్‌టెల్ సరికొత్త ప్లాన్...

దేశీయ టెలికాం సంచలనం రిలయన్స్ జియోకు ధీటుగా ఎయిర్‌టెల్ సరికొత్త ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్లాన్ ధర రూ.449. ఈ నూతన ప్రీపెయిడ్ ప్లాన్‌‌ను తీసుకునే కస్టమర్లకు రోజుకు 2 జీబీ డేటా లభిస్తుంది. ఈ

జియోకు ధీటుగా ఎయిర్‌టెల్ సరికొత్త ప్లాన్...
, సోమవారం, 28 మే 2018 (17:17 IST)
దేశీయ టెలికాం సంచలనం రిలయన్స్ జియోకు ధీటుగా ఎయిర్‌టెల్ సరికొత్త ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్లాన్ ధర రూ.449. ఈ నూతన ప్రీపెయిడ్ ప్లాన్‌‌ను తీసుకునే కస్టమర్లకు రోజుకు 2 జీబీ డేటా లభిస్తుంది. ఈ ప్లాన్ వాలిడిటీ 70 రోజులు కనుక మొత్తం 140 జీబీ డేటాను వినియోగదారులు వాడుకోవచ్చు.
 
ఇందులో అన్‌లిమిటెడ్ లోకల్, ఎస్‌టీడీ కాల్స్, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు వస్తాయి. ఇక జియోలో ఇదే తరహాలో రూ.448 ప్లాన్ అందుబాటులో ఉండగా ఆ ప్లాన్‌లో కస్టమర్లకు రోజుకు 2జీబీ డేటా వస్తుంది. మొత్తం 80 రోజుల వాలిడిటీకి 160 జీబీ డేటా లభిస్తుంది. ఈ ప్లాన్‌కు పోటీగానే ఎయిర్‌టెల్ రూ.449 ప్లాన్‌ను ప్రవేశపెట్టడం గమనార్హం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పాకిస్థాన్ తాత్కాలిక ప్రధానిగా మాజీ చీఫ్ జస్టీస్.. ఎందుకు?