మొబైల్ యూజర్లకు శుభవార్త చెప్పిన జియో

Webdunia
సోమవారం, 9 డిశెంబరు 2019 (09:24 IST)
తన ప్రీపెయిడ్ మొబైల్ యూజర్లకు రిలయన్స్ జియో శుభవార్త చెప్పింది. ఇటీవల మొబైల్ టారిఫ్‌లను జియో పెంచింది. పైగా, రెండు ప్లాన్లను ఎత్తివేసింది. అయితే, పెంచిన ధరలు ఎక్కువగా ఉన్నాయనే విమర్శలు వచ్చాయి. పైగా, దిగువ తరగతి శ్రేణికి అందుబాటులో ఉన్న రెండు ప్లాన్లను రద్దు చేయడంపై కూడా విమర్శలు వచ్చాయి. దీంతో ఆ రద్దు చేసిన రెండు ప్లాన్లను తిరిగి ప్రవేశపెట్టింది. 
 
ఈ నేపథ్యంలో రూ.98, రూ.149 ప్లాన్ల‌ను మ‌ళ్లీ ప్ర‌వేశ‌పెడుతున్న‌ట్లు తెలిపింది. ఈ మ‌ధ్యే పెంచిన మొబైల్ టారిఫ్‌ల‌కు అనుగుణంగా నూత‌న ప్లాన్ల‌ను లాంచ్ చేసిన జియో అంత‌కు ముందు ఉన్న రూ.98, రూ.149 ప్లాన్ల‌ను మ‌ళ్లీ అందుబాటులోకి తెచ్చిన‌ట్లు ప్ర‌క‌టించింది. 
 
ఇందులో రూ.98 ప్లాన్లను ఎంచుకునే యూజర్లకు 2 జీబీ డేటాతో పాటు.. 300 ఎంఎంఎస్‌లు, జియో టు జియో అన్‌లిమిటెడ్ కాల్స్‌ చేసుకోవచ్చు. ఆ ప్లాన్ కాలపరిమితి 28 రోజులు. ఇతర నెట్‌వర్క్ చేసుకునే కాల్స్‌కు నిమిషానికి ఆరు పైసలు చెప్పున వసూలు చేస్తారు. 
 
ఇకపోతే, రూ.149 ప్లాన్‌లో రోజుకు 1జీబీ డేటా, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు, జియో టు జియో అన్‌లిమిటెడ్ కాల్స్‌, 300 నిమిషాల నాన్ జియో కాల్స్ ల‌భిస్తాయి. ఈ ప్లాన్ వాలిడిటీని 24 రోజులుగా నిర్ణ‌యించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బ్యాడ్ బాయ్ కార్తీక్ నుంచి నాగ శౌర్య, శ్రీదేవి విజయ్ కుమార్ ఎమోషనల్ సాంగ్

హార్ట్‌ వీక్‌గా ఉన్నవాళ్లు ఈషా సినిమా చూడొద్దు : బన్నీ వాస్‌, వంశీ నందిపాటి

ఏవీఎం శరవణన్ భౌతికకాయానిక నివాళులు.. సూర్య కంటతడి

నా నుంచి ఎలాంటి బ్రేకింగ్ న్యూస్‌లు ఆశించకండి : రాజ్ నిడిమోరు మాజీ భార్య

Nayanatara: చిరంజీవి, నయనతార లపై రెండవ సింగిల్ శశిరేఖ లిరికల్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

తర్వాతి కథనం
Show comments