Webdunia - Bharat's app for daily news and videos

Install App

మొబైల్ యూజర్లకు శుభవార్త చెప్పిన జియో

Webdunia
సోమవారం, 9 డిశెంబరు 2019 (09:24 IST)
తన ప్రీపెయిడ్ మొబైల్ యూజర్లకు రిలయన్స్ జియో శుభవార్త చెప్పింది. ఇటీవల మొబైల్ టారిఫ్‌లను జియో పెంచింది. పైగా, రెండు ప్లాన్లను ఎత్తివేసింది. అయితే, పెంచిన ధరలు ఎక్కువగా ఉన్నాయనే విమర్శలు వచ్చాయి. పైగా, దిగువ తరగతి శ్రేణికి అందుబాటులో ఉన్న రెండు ప్లాన్లను రద్దు చేయడంపై కూడా విమర్శలు వచ్చాయి. దీంతో ఆ రద్దు చేసిన రెండు ప్లాన్లను తిరిగి ప్రవేశపెట్టింది. 
 
ఈ నేపథ్యంలో రూ.98, రూ.149 ప్లాన్ల‌ను మ‌ళ్లీ ప్ర‌వేశ‌పెడుతున్న‌ట్లు తెలిపింది. ఈ మ‌ధ్యే పెంచిన మొబైల్ టారిఫ్‌ల‌కు అనుగుణంగా నూత‌న ప్లాన్ల‌ను లాంచ్ చేసిన జియో అంత‌కు ముందు ఉన్న రూ.98, రూ.149 ప్లాన్ల‌ను మ‌ళ్లీ అందుబాటులోకి తెచ్చిన‌ట్లు ప్ర‌క‌టించింది. 
 
ఇందులో రూ.98 ప్లాన్లను ఎంచుకునే యూజర్లకు 2 జీబీ డేటాతో పాటు.. 300 ఎంఎంఎస్‌లు, జియో టు జియో అన్‌లిమిటెడ్ కాల్స్‌ చేసుకోవచ్చు. ఆ ప్లాన్ కాలపరిమితి 28 రోజులు. ఇతర నెట్‌వర్క్ చేసుకునే కాల్స్‌కు నిమిషానికి ఆరు పైసలు చెప్పున వసూలు చేస్తారు. 
 
ఇకపోతే, రూ.149 ప్లాన్‌లో రోజుకు 1జీబీ డేటా, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు, జియో టు జియో అన్‌లిమిటెడ్ కాల్స్‌, 300 నిమిషాల నాన్ జియో కాల్స్ ల‌భిస్తాయి. ఈ ప్లాన్ వాలిడిటీని 24 రోజులుగా నిర్ణ‌యించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Modi: మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు - మోదీ, చంద్రబాబుకు ధన్యవాదాలు : పవన్ కళ్యాణ్ (video)

NTR: ఎన్.టి.ఆర్., ప్రశాంత్ నీల్ చిత్రం డ్రాగన్ అప్ డేట్

Akhil: పుట్టేటప్పుడు పేరు ఉండదు. పోయేటప్పుడు ఊపిరి ఉండదు - అఖిల్.. లెనిన్ గ్లింప్స్

Prabhas: రాజాసాబ్ రిలీజ్ కోసం తిరుపతి, శ్రీకాళహస్తి ఆలయాలను దర్శించిన మారుతి

Vijayashanti : కళ్యాణ్ రామ్, విజయశాంతి పై ముచ్చటగా బంధాలే.. పాట చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments