Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌లో అతిపెద్ద టెలికాం సంస్థగా రిలయన్స్ జియో

Webdunia
శుక్రవారం, 17 జనవరి 2020 (10:40 IST)
దేశంలో అతిపెద్ద టెలికాం సంస్థగా రిలయన్స్ జియో అవతరించింది. అంటే వినియోగదారుల సంఖ్యాపరంగా అతిపెద్ద సంస్థగా నిలిచింది. ఈ విషయాన్ని ట్రాయ్‌ తాజా గణాంకాలు వెల్లడించాయి. జియో సేవలు అందుబాటులోకి రాకమునుపు ఎయిర్‌టెల్ అగ్రస్థానంలో ఉన్న విషయం తెల్సిందే. 
 
2019 నవంబర్ నాటికి జియో చందాదారుల సంఖ్య 36.9 కోట్లకు చేరుకుందని ట్రాయ్ తెలిపింది. జియో తర్వాతి స్థానంలో 33.62 కోట్ల మంది వినియోగదారులతో వొడాఫోన్‌ ఐడియా, 32.73 కోట్ల వినియోగదారులతో ఎయిర్‌‌టెల్‌ నిలిచాయి. 
 
అక్టోబరు నాటికి దేశంలో టెలికాం యూజర్ల సంఖ్య 120.48 కోట్లుండగా, నవంబర్‌ ముగిసేసరికి ఆ సంఖ్య 2.4 శాతం తగ్గి 117.58 కోట్లకు చేరుకున్నట్టు ట్రాయ్ తాజా గణాంకాల ద్వారా వెల్లడైంది. అయితే, వొడాఫోన్ ఇండియా 36 మిలియన్ల మంది వినియోగదారులను కోల్పోయినప్పటికీ రెండో స్థానంలో కొనసాగడం గమనార్హం. 
 
కాగా, ఇటీవల రిలయన్స్ జియో ఇతర మొబైల్ నెట్‌వర్క్‌లకు అందిస్తున్న సేవలపై చార్జీలు వసూలు చేయడం ప్రారంభించింది. దీంతో అనేక మంది వినియోగదారులు ఇతర నెట్‌వర్క్‌లకు వెళుతున్నారు. అయినప్పటికీ రిలయన్స్ జియో అగ్రస్థానంలో ఉండటం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Photos in Sydney: ఫోటోలను క్లిక్ మనిపించింది ఎవరు..? సమంత సమాధానం ఏంటంటే?

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments