Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌లో అతిపెద్ద టెలికాం సంస్థగా రిలయన్స్ జియో

Webdunia
శుక్రవారం, 17 జనవరి 2020 (10:40 IST)
దేశంలో అతిపెద్ద టెలికాం సంస్థగా రిలయన్స్ జియో అవతరించింది. అంటే వినియోగదారుల సంఖ్యాపరంగా అతిపెద్ద సంస్థగా నిలిచింది. ఈ విషయాన్ని ట్రాయ్‌ తాజా గణాంకాలు వెల్లడించాయి. జియో సేవలు అందుబాటులోకి రాకమునుపు ఎయిర్‌టెల్ అగ్రస్థానంలో ఉన్న విషయం తెల్సిందే. 
 
2019 నవంబర్ నాటికి జియో చందాదారుల సంఖ్య 36.9 కోట్లకు చేరుకుందని ట్రాయ్ తెలిపింది. జియో తర్వాతి స్థానంలో 33.62 కోట్ల మంది వినియోగదారులతో వొడాఫోన్‌ ఐడియా, 32.73 కోట్ల వినియోగదారులతో ఎయిర్‌‌టెల్‌ నిలిచాయి. 
 
అక్టోబరు నాటికి దేశంలో టెలికాం యూజర్ల సంఖ్య 120.48 కోట్లుండగా, నవంబర్‌ ముగిసేసరికి ఆ సంఖ్య 2.4 శాతం తగ్గి 117.58 కోట్లకు చేరుకున్నట్టు ట్రాయ్ తాజా గణాంకాల ద్వారా వెల్లడైంది. అయితే, వొడాఫోన్ ఇండియా 36 మిలియన్ల మంది వినియోగదారులను కోల్పోయినప్పటికీ రెండో స్థానంలో కొనసాగడం గమనార్హం. 
 
కాగా, ఇటీవల రిలయన్స్ జియో ఇతర మొబైల్ నెట్‌వర్క్‌లకు అందిస్తున్న సేవలపై చార్జీలు వసూలు చేయడం ప్రారంభించింది. దీంతో అనేక మంది వినియోగదారులు ఇతర నెట్‌వర్క్‌లకు వెళుతున్నారు. అయినప్పటికీ రిలయన్స్ జియో అగ్రస్థానంలో ఉండటం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినీ కార్మికుల సమ్మె వెనుక కుట్ర - రాజీనామాలు చేసిన కాదంబరి కిరణ్

Manoj: మ్యాజికల్ స్టిక్ తో తేజ సజ్జా, బ్లాక్ స్వోర్డ్ తో మనోజ్ ల మిరాయ్ పోరాటం

Raviteja: మాస్ జాతర ఆలస్యమైనా అసలైన పండుగను సిద్ధమంటూ నిర్మాతలు ప్రకటన

Sivakarthikeyan : మానసిక స్థితి కలిగిన వ్యక్తిగా శివకార్తికేయన్ మదరాసి

OG: పవన్ కళ్యాణ్ పుట్టినరోజున దే కాల్ హిమ్ ఓజీ. నుంచి కొత్త అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం
Show comments